నవీ ముంబైలోని ఐరోలి ప్రాంతంలో నివసించే 50 ఏళ్ల బలిరామ్ సూర్యనాథ్ కుష్వాహా ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. భర్త ఏమయ్యాడో తెలియదంటూ భార్య సునిత అందరినీ నమ్మించింది. ఇరుగుపొరుగు, బంధువులు కూడా అది నిజమేనని భావించారు. కానీ, కళ్ల ముందే తిరుగుతున్న ఆ నిశ్శబ్ద వాతావరణం వెనుక ఒక భయంకరమైన హంతకురాలు దాగి ఉందనే నిజం 11 నెలల వరకు ఎవరికీ తెలియలేదు. ఒక పక్కా క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగిన ఈ హత్యోదంతం చివరకు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
నిశ్శబ్దంగా సాగిన కుట్ర

బలిరామ్ భార్య సునిత (40)కు రాహుల్ దశరథ్ ప్రజాపతి (30) అనే ఆటో డ్రైవర్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరి రహస్య బంధం కాస్తా బలిరామ్కు తెలిసింది. భార్య ప్రవర్తనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు, ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తమ సుఖానికి అడ్డు వస్తున్న బలిరామ్ను శాశ్వతంగా వదిలించుకోవాలని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఒక పక్కా స్కెచ్తో, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముందుగా పిల్లలను బంధువుల ఇంటికి పంపేశారు.
ఆగస్టు 9 అర్ధరాత్రి... ఆఖరి శ్వాస
2025 ఆగస్టు 9వ తేదీ అర్ధరాత్రి. బలిరామ్ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నాడు. అదే అతడికి ఆఖరి రాత్రి అవుతుందని ఊహించలేదు. సునిత, రాహుల్ ఇద్దరూ కలిసి నిద్రిస్తున్న బలిరామ్ పైబడి గొంతు నొక్కి ఊపిరాడకుండా చేశారు. ఆపై పదునైన చాకుతో గొంతు కోసి ప్రాణాలు తీశారు.
హత్య చేయడం ఒకెత్తయితే, శవాన్ని మాయం చేయడం మరో ఎత్తు. పట్టుబడితే జీవితం జైలు పాలవుతుందనే భయంతో, వారు అత్యంత కిరాతకమైన నిర్ణయం తీసుకున్నారు. బలిరామ్ మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికారు. ఆ రక్తసిక్తమైన శరీర భాగాలను వేర్వేరు సంచుల్లో ప్యాక్ చేశారు.
గవ్లీ దేవ్ అడవిలో శరీర భాగాలు
అర్ధరాత్రి వేళ, నిశ్శబ్దంగా ఉన్న రోడ్లపై రాహుల్ తన ఆటోలో ఆ సంచులను ఎక్కించుకున్నాడు. నవీ ముంబైలోని దట్టమైన 'గవ్లీ దేవ్' కొండల అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. దారి పొడవునా ఎవరూ చూడకుండా, ఆ నల్లటి చీకట్లో అడవిలోని వేర్వేరు జనసంచారం లేని ప్రదేశాలలో ఆ శరీర భాగాలను పడేసి పరారయ్యారు.
{{/usCountry}}అర్ధరాత్రి వేళ, నిశ్శబ్దంగా ఉన్న రోడ్లపై రాహుల్ తన ఆటోలో ఆ సంచులను ఎక్కించుకున్నాడు. నవీ ముంబైలోని దట్టమైన 'గవ్లీ దేవ్' కొండల అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. దారి పొడవునా ఎవరూ చూడకుండా, ఆ నల్లటి చీకట్లో అడవిలోని వేర్వేరు జనసంచారం లేని ప్రదేశాలలో ఆ శరీర భాగాలను పడేసి పరారయ్యారు.
{{/usCountry}}"హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత, సునిత ఐరోలిలోని ఇల్లును వేరే వారికి అద్దెకు ఇచ్చేసింది. ఏమీ తెలియనట్లు పిల్లలను తీసుకుని ఘన్సోలి ప్రాంతానికి కాపురం మార్చింది" అని పోలీసులు తెలిపారు.
సిమ్ కార్డులు మారినా చిక్కిన క్లూ
దాదాపు 11 నెలల పాటు ఈ కేసులో ఎలాంటి చలనం లేదు. కానీ, 2026 ఏప్రిల్లో బలిరామ్ తమ్ముడు సునితను కలవడానికి వచ్చినప్పుడు కథ మలుపు తిరిగింది. అన్నయ్య గురించి అడిగినప్పుడు సునిత చెప్పిన సమాధానాలు పరస్పర విరుద్ధంగా ఉండడంతో అతనికి గట్టి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు అదృశ్యం ఫిర్యాదు ఇచ్చాడు.
రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక దర్యాప్తును ఆశ్రయించారు. నిందితులు ఇద్దరూ పోలీసుల కళ్లు గప్పేందుకు నిరంతరం మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు మారుస్తూ వచ్చారు. అయితే, వారి పాత కాల్ డిటైల్ రికార్డ్స్ (CDR)ను నిశితంగా పరిశీలించినప్పుడు, వారిద్దరూ గత కొన్ని నెలలుగా నిరంతరం టచ్లో ఉన్నట్లు తేలింది. దీనితో సునిత, రాహుల్లను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించగా, వారు చేసిన పాపాన్ని ఒప్పేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో గవ్లీ దేవ్ అడవి నుంచి కొన్ని అస్థిపంజర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103 (హత్య), 238 (ఆధారాల నిర్మూలన), 3(5) కింద కేసు నమోదు చేసి, కోర్టు అనుమతితో 7 రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. మిగిలిన శరీర భాగాల కోసం అడవిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.