UPI In ATM : ఏటీఎంలో డబ్బులు తీయాలా? ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్!
UPI In ATM : ఏటీఎం ద్వారా డబ్బులు తీయాలనుకుంటున్నారా? అయితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధన రానుంది. కొత్త రూల్ ఏంటో తెలుసుకోండి.
ఏప్రిల్ నెల సమీపిస్తోంది. ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులు ఏటీఎం లావాదేవీల నిబంధనలలో గణనీయమైన మార్పులను అమలు చేస్తున్నాయి. ఇది మీ ఉచిత లావాదేవీ పరిమితి, నగదు ఉపసంహరణ ఛార్జీలపై నేరుగా ప్రభావం చూపుతుంది.

హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పీఎన్బీ వంటి బ్యాంకులు కొత్త నిబంధనలను ప్రకటించాయి. ఈ నిబంధనల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ఉపయోగించి ఏటీఎంల నుండి చేసే నగదు ఉపసంహరణలు కూడా మీ ఉచిత లావాదేవీ పరిమితిలో భాగంగా పరిగణిస్తారు. అంటే మీ ఫ్రీ లిమిట్లో ఈ యూపీఐ ఉపయోగించి చేసే సర్వీస్ కూడా కౌంట్ అవుతుంది.
వాస్తవానికి ఏప్రిల్ 1వ తేదీ నుండి యూపీఐ ఉపయోగించి ఏటీఎంల నుండి చేసే నగదు ఉపసంహరణలు కూడా మీ ఉచిత లావాదేవీ పరిమితిలో భాగంగానే పరిగణిస్తారు. మీరు పరిమితిని మించి లావాదేవీలు జరిపితే.. మీకు అదనపు ఛార్జీలు విధిస్తారు.
యూపీఐ ద్వారా ఏటీఎం నుండి నగదు ఉపసంహరణను ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం, మీ ఉచిత నెలవారీ పరిమితికి కలుపుతారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వంటి బ్యాంకులు ఈ కొత్త నిబంధనలను ప్రకటించాయి.
అటువంటి పరిస్థితిలో మీరు బ్యాంకు ఉచిత లావాదేవీ పరిమితి కంటే ఎక్కువగా ఏటీఎం నుండి నగదు విత్డ్రా చేస్తే, ప్రతి అదనపు లావాదేవీకి బ్యాంకు మీ నుండి రూ.23 వరకు రుసుము వసూలు చేస్తుంది. ప్రస్తుతం బ్యాంకు తన ఏటీఎంల నుండి నెలకు ఐదుసార్లు ఉచితంగా నగదు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికొస్తే, మెట్రో నగరాల్లో ఉచిత నగదు విత్డ్రా పరిమితి మూడుసార్లు, మెట్రోయేతర నగరాల్లో ఐదుసార్లుగా ఉంది.
యూపీఐని ఉపయోగించి ఏటీఎం నుండి డబ్బు విత్డ్రా చేసుకునే ప్రక్రియ కూడా చాలా సులభం. డెబిట్ కార్డ్ లేకుండా నగదు విత్డ్రా చేసుకోవడానికి, కస్టమర్లు ఏటీఎం స్క్రీన్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి.. తమ యూపీఐ యాప్లో లావాదేవీని ఆమోదిస్తే సరిపోతుంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి అనేక బ్యాంకులు ఈ ఫీచర్ను ప్రవేశపెడుతున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా తన కొన్ని డెబిట్ కార్డులపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించాలని నిర్ణయించింది. బ్యాంక్ ఇంకా పూర్తి వివరాలను అందించలేదు. అయితే రోజువారీ ఉపసంహరణ పరిమితిని 50 శాతం వరకు తగ్గించవచ్చని సమాచారం. వినియోగదారులు తమ కార్డు నిబంధనలను సరిచూసుకోవాలని, పెద్ద లావాదేవీల కోసం యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ మార్గాలను ఉపయోగించాలని బ్యాంక్ సూచిస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


