7 seater cars : నెల రోజులు.. మూడు 7 సీటర్ కార్లు! బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు..
భారతీయ రోడ్లపై ఫ్యామిలీ కార్ల సందడి పెరగనుంది. వచ్చే ఒక నెల వ్యవధిలో మూడు విభిన్న విభాగాలకు చెందిన 7-సీటర్ ఎంపీవీలు (MPV) లాంచ్ కానున్నాయి. బడ్జెట్ ధరలో నిస్సాన్ గ్రావిటీ, లగ్జరీ సెగ్మెంట్లో మెర్సిడెస్ వి-క్లాస్, మరియు ఎలక్ట్రిక్ విభాగంలో విన్ఫాస్ట్ లిమో గ్రీన్ కారు ప్రియులను అలరించనున్నాయి.
వచ్చే కొన్ని వారాల్లో సరికొత్త ఎంపీవీ మోడళ్లతో భారత ఆటోమొబైల్ మార్కెట్ కళకళలాడనుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి అవసరాలకు తగ్గట్టుగా విభిన్న శ్రేణిలో ఈ కార్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి- మార్చ్ మధ్య లాంచ్ కానున్న ఆ 3 కార్ల పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మూడు కొత్త 7 సీటర్ కార్లు ఇవే- ఫ్యామిలీకి బెస్ట్ ఛాయిస్!
1. నిస్సాన్ గ్రావిటే
నిస్సాన్ ఇండియా తన కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 7-సీటర్ ఎంపీవీ గ్రావిటేని ఫిబ్రవరి 17, 2026న ఆవిష్కరించనుంది. ఇది ఇప్పటికే మార్కెట్లో పాపులర్ అయిన రెనాల్ట్ ట్రైబర్కు సమానమైన ప్లాట్ఫామ్పై వస్తోంది.
లుక్ అండ్ డిజైన్: ట్రైబర్ బాడీని పోలి ఉన్నప్పటికీ, నిస్సాన్ తనదైన 'వీ-మోషన్' ఫ్రంట్ గ్రిల్, కొత్త స్టైలిష్ హెడ్ల్యాంప్స్, స్పోర్టీ బంపర్తో దీనికి సరికొత్త రూపం ఇచ్చింది.
ఫీచర్లు: లోపల ఆల్-బ్లాక్ ఇంటీరియర్తో పాటు డోర్ల వద్ద బేజ్ కలర్ టచ్ ఇచ్చారు. 3-స్పోక్ స్టీరింగ్, అవసరమైనప్పుడు తీసివేయగలిగే మూడొవ వరుస సీట్లు దీని ప్రత్యేకత.
ఇంజిన్: ఇందులో 72 బీహెచ్పీ పవర్ ఇచ్చే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ (ఏఎంటీ) గేర్బాక్స్లతో లభిస్తుంది.
నిస్సాన్ గ్రావిటేకి సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
2. మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్
విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారి కోసం మెర్సిడెస్ బెంజ్ తన వీ-క్లాస్ ఎంపీవీని సరికొత్త హంగులతో మార్చ్ 3, 2026న లాంచ్ చేస్తోంది.
లగ్జరీ ఫీచర్లు: దీని క్యాబిన్లో రెండు పెద్ద డిజిటల్ డిస్ప్లేలు (టచ్స్క్రీన్, డ్రైవర్ డిస్ప్లే) ఉంటాయి. లోపల విశాలమైన స్థలం, ప్రీమియం సీట్లతో ఇది 'రోడ్లపై నడిచే విమానం'లా ఉంటుంది.
పర్ఫార్మెన్స్: ఇందులో 2.0 లీటర్, 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 158 బీహెచ్పీ పవర్, 380 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
ధర: ఇది టయోటా వెల్ఫైర్కు పోటీగా వస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.10 కోట్ల నుంచి రూ. 1.25 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా.
3. విన్ఫాస్ట్ లిమో గ్రీన్
వియత్నాంకు చెందిన ఈవీ దిగ్గజం విన్ఫాస్ట్, భారత్లో తన మూడొవ మోడల్గా లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ ఎంపీవీని ఫిబ్రవరి-మార్చ్ మధ్యలో విడుదల చేయనుంది.
పవర్ అండ్ రేంజ్: 60.13 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో వచ్చే ఈ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ఛార్జింగ్: 80 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్తో కేవలం 30 నిమిషాల్లో 10 నుంచి 70 శాతం వరకు ఛార్జింగ్ పూర్తవుతుంది.
ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ నేరుగా కియా క్యారెన్స్ ఈవీకి గట్టి పోటీనిచ్చేలా, చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది.
విన్ఫాస్ట్ లిమో గ్రీన్ ఈవీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

E-Paper












