Oracle layoffs 2026 : మనుషుల పని ఏఐకి.. ఒరాకిల్‌లో వేలాది మంది లేఆఫ్​! టెక్ రంగంలో కొత్త కలకలం..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏ) డేటా సెంటర్ల విస్తరణ కోసం చేస్తున్న భారీ వ్యయం వల్ల ఏర్పడిన నగదు కొరతను అధిగమించేందుకు ఒరాకిల్ కార్పొరేషన్ వేలాది ఉద్యోగాల్లో కోత విధించాలని యోచిస్తోంది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ నెలలోనే లేఆఫ్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Published on: Mar 06, 2026 1:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారీ ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) డేటా సెంటర్ల విస్తరణ ప్రయత్నాల వల్ల తలెత్తిన నగదు కొరతను నిర్వహించే చర్యల్లో భాగంగా ఒరాకిల్ కార్పొరేషన్ వేలాది మంది ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఒరాకిల్ లేఆఫ్స్ కంపెనీలోని వివిధ విభాగాలపై ప్రభావం చూపుతాయని, ఈ నెలలోనే వీటిని అమలు చేయవచ్చని ఈ ప్రైవేట్ ప్రణాళికల గురించి తెలిసిన వ్యక్తులు సమాచారం ఇచ్చారు.

టెక్​ దిగ్గజం ఒరాకిల్​లో లేఆఫ్స్​..
టెక్​ దిగ్గజం ఒరాకిల్​లో లేఆఫ్స్​..

ఏఐ వినియోగం పెరగడం వల్ల భవిష్యత్తులో తక్కువ అవసరముంటుందని భావిస్తున్న కొన్ని ఉద్యోగ విభాగాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఓరాకిల్​ లేఆఫ్స్​ 2026 ఉండవచ్చని తెలుస్తోంది.

ఓరాకిల్​ లేఆఫ్స్​ 2026- ఏఐ దిశగా అడుగులు..

చైర్మన్ లారీ ఎల్లిసన్ నాయకత్వంలో, ఓపెన్ ఏఐ వంటి కస్టమర్ల ఏఐ వర్క్‌లోడ్స్‌ను నిర్వహించేందుకు ఒరాకిల్ రికార్డు స్థాయిలో డేటా సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టింది. సుదీర్ఘ కాలంగా డేటాబేస్ సాఫ్ట్‌వేర్‌కు పేరొందిన ఈ కంపెనీ, గత కొన్నేళ్లుగా తన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్‌ను ఏఐపై దృష్టి పెట్టి బలోపేతం చేస్తోంది. తద్వారా మార్కెట్ లీడర్లుగా ఉన్న అమెజాన్, మైక్రోసాఫ్ట్​లకు గట్టి పోటీదారుగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బ్లూమ్‌బెర్గ్ చెబుతున్న గణాంకాల ప్రకారం.. క్లౌడ్ యూనిట్ డేటా సెంటర్ల కోసం చేసే భారీ వ్యయం వల్ల వచ్చే కొన్నేళ్ల పాటు ఒరాకిల్ నగదు మారుతుందని వాల్ స్ట్రీట్ అంచనా వేస్తోంది. ఈ పెట్టుబడుల ఫలితాలు 2030 నాటికి అందడం ప్రారంభిస్తాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, అప్పులు, ఈక్విటీ విక్రయాల ద్వారా ఈ ఏడాది ఏకంగా 50 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 4.1 లక్షల కోట్లు) నిధులను సేకరిస్తామని గత నెలలో ఒరాకిల్ ప్రకటించింది.

ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీలో లేఆఫ్స్: 2,500 మంది ఉద్యోగులపై వేటు.. అసలు కారణం ఏంటి?

ఓరాకిల్​ లేఆఫ్స్​ 2026- ప్రభావం ఎంత?

ఒరాకిల్ ప్లాన్ చేస్తున్న ఈ లేఆఫ్స్, కంపెనీ సాధారణంగా చేసే రోలింగ్ జాబ్ కట్స్ కంటే చాలా విస్తృతంగా ఉండవచ్చని సమాచారం. ఈ వారంలోనే ఒరాకిల్ అంతర్గతంగా ఒక ప్రకటన చేస్తూ.. క్లౌడ్ విభాగంలో ఉన్న అనేక ఖాళీ ఉద్యోగ ప్రకటనలను మీక్షిస్తున్నట్లు తెలిపింది. ఇది నియామక ప్రక్రియను నెమ్మదింపజేయడం లేదా పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలకు దారితీస్తుందని ఈ నిర్ణయం గురించి తెలిసిన వ్యక్తులు చెప్పారు.

మే 2025 చివరి నాటికి ఒరాకిల్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,62,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వర్క్‌ఫోర్స్ తగ్గింపు ప్లానింగ్ ఇంకా జరుగుతోందని, ఇందులో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.

అయితే ఒరాకిల్ యాజమాన్యం దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.

ఏఐ డేటా సెంటర్ల ధర - మానవ వనరుల తొలగింపు..

ఏఐ క్లౌడ్ ప్రొవైడర్‌గా ఒరాకిల్ తీసుకున్న ప్రారంభ నిర్ణయాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. దీనివల్ల కంపెనీ స్టాక్ 2024లో 61%, అంతకుముందు ఏడాది 20% పెరిగింది. అయితే ఖర్చులు పెరగడంతో మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది.

బుధవారం ముగింపు సమయానికి, 2025 సెప్టెంబర్‌లో నమోదైన గరిష్ట స్థాయి నుంచి షేర్లు 54% పడిపోయాయి.

ఏఐ కోసం ముందుగా పెట్టాల్సిన భారీ ఖర్చులు టెక్ పరిశ్రమ అంతటా కోతలకు దారితీస్తున్నాయి. డేటా సెంటర్లు, ఏఐ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిపై పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ గత ఏడాది సుమారు 15,000 మందిని తొలగించింది. గత వారం ‘బ్లాక్ ఇంక్’ తన సిబ్బందిలో దాదాపు సగం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది, ఏఐ వల్ల సామర్థ్యం పెరుగుతోందని సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే పేర్కొన్నారు.

సెప్టెంబర్‌లో ఒరాకిల్ ఒక ఫైలింగ్‌లో వెల్లడిస్తూ.. మే నెలతో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకు సుమారు 1.6 బిలియన్ డాలర్ల (రూ. 13,300 కోట్లు) ఖర్చు అవుతుందని, ఇందులో ఉద్యోగం వదిలి వెళ్లే వారికి ఇచ్చే సెవెరెన్స్ చెక్కులు కూడా ఉన్నాయని పేర్కొంది. ఇది ఒరాకిల్ గతంలో వెల్లడించిన ఏ ఇతర ప్లాన్ కంటే చాలా పెద్దది.

రాబోయే మంగళవారం నాడు కంపెనీ తన మూడవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More