...
...
Next Story

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్యల కలకలం: 'ఇడియట్', 'అంధభక్త్' పదాలపై రచ్చ

లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్‌పై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఒక విద్యార్థితో జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ ఆయన "స్టూడెంట్స్, ఇడియట్స్, అంధభక్త్స్" అని ప్రజలను మూడు వర్గాలుగా వర్గీకరించడం పట్ల అధికార పక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

Published on: Jul 29, 2026, 14:21:10 IST
Advertisement

లోక్‌సభలో బుధవారం పేపర్ లీకేజీల నిరోధక బిల్లు (Public Examinations Bill, 2026)పై విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన తీరు సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనల నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు పార్లమెంట్‌లో తీవ్ర నిరసనలకు కారణమయ్యాయి.

రాహుల్ గాంధీ ఏమన్నారంటే?

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్యల కలకలం (Sansad TV)
పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్యల కలకలం (Sansad TV)

ఓ 18 ఏళ్ల విద్యార్థినితో తాను జరిపిన సంభాషణను సభలో గుర్తుచేసుకుంటూ రాహుల్ గాంధీ సమాజంలో మూడు రకాల ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు.

"మొదటి వర్గం 'స్టూడెంట్స్' (విద్యార్థులు) – వీరు నిజాన్ని అంగీకరిస్తారు, నమ్రత కలిగి ఉంటారు. రెండో వర్గం 'ఇడియట్స్' – వీరు తమకే అంతా తెలుసని, తమను తాము దేవుడిగా భావిస్తూ ఇతరుల మాట వినరు. ఇక మూడో వర్గం 'అంధభక్త్' – మరొక ఇడియట్‌ను దేవుడిగా నమ్మే వ్యక్తే అంధభక్త్," అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

భాజపా ఎంపీలు కూడా తమ ఇంట్లోని పిల్లలను అడిగితే విద్యార్థుల ఆందోళనకు మద్దతు ఇస్తారని, యువత పోరాటం పట్ల ప్రతి భారతీయుడు గర్వపడాలని ఆయన పేర్కొన్నారు.

భాజపా ఆగ్రహం - రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెంటనే జోక్యం చేసుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "రాహుల్ గాంధీ విద్యార్థుల పేరు చెప్పి అన్‌పార్లమెంటరీ పదాలను ఉపయోగిస్తున్నారు. ఇడియట్, అంధభక్త్ వంటి పదాలను సభలో ఉపయోగించడం తగదు. వీటిని వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి" అని డిమాండ్ చేశారు.

సభలో గందరగోళం చెలరేగడంతో, సభను అదుపులో ఉంచడం స్పీకర్ బాధ్యత అని, తాను నోరు విప్పగానే అధికార పక్షం అరిచి గందరగోళం చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe