ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల వేడి తీవ్రరూపం దాల్చింది. మంగళవారం (జూలై 21, 2026) పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం (7, లోక్ కళ్యాణ్ మార్గ్) వెలుపల భారీ ధర్నా చేపట్టారు.

సోమవారం 'సన్సద్ ఛలో' మార్చ్ చేపట్టిన సిజెపి (CJP) విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన లాఠీఛార్జ్, టియర్ గ్యాస్కు నిరసనగా రాహుల్ గాంధీ ఈ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
ఈ ధర్నాలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరాతో సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఒక ప్రతిపక్ష నేత నేరుగా ప్రధాని నివాసం ఎదుట బైఠాయించి నిరసన తెలపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
“నిన్న యువ విద్యార్థులపై జరిగిన క్రూరమైన దాడికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ఈ అంశంపై బాధ్యత వహించడానికి కానీ, పార్లమెంట్లో చర్చించడానికి కానీ సిద్ధంగా లేదు. దేశంలోని యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధాని, హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి” అని రాహుల్ గాంధీ (సామాజిక మాధ్యమం 'X' లో) పేర్కొన్నారు.
'ఆయన్ను నిద్రలేపేందుకే ఇక్కడికి వచ్చాం'
పార్లమెంట్లో విద్యార్థుల సమస్యపై చర్చించేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తమకు అవకాశం ఇవ్వలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. సభలో చర్చ జరగాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని స్పీకర్ తనకు చెప్పారని వెల్లడించారు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్, "పదండి.. ఈ విషయంలో ప్రధానిని నిద్రలేపుదాం" అని ఎంపీలతో చెప్పి నిరసన ప్రదర్శనగా ప్రధాని నివాసానికి బయలుదేరారు.
కాగా, PMO సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రధాని నివాసం వద్దకు వచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడి నిరసన విరమించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ఆక్రమించింది
{{/usCountry}}కాగా, PMO సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రధాని నివాసం వద్దకు వచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడి నిరసన విరమించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ఆక్రమించింది
{{/usCountry}}ప్రధాని నివాసానికి బయలుదేరే ముందు పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో విద్యా వ్యవస్థ, పోటీ పరీక్షల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని, లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని విమర్శించారు. దేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ (RSS) తన గుప్పెట్లోకి తీసుకుందని, మోదీ ప్రభుత్వం విద్యార్థుల కంటే పారిశ్రామికవేత్తలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.
ఆస్పత్రిలో విద్యార్థుల పరామర్శ:
మీడియా సమావేశం అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్లతో కలిసి రామ్ మనోహర్ లోహియా (RML) ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష
మరోవైపు ప్రముఖ పర్యావరణ వేత్త, విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్చుక్ సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. జూలై 18న ఆయనను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆయన రక్తంలో పొటాషియం స్థాయిలు 3.2 mEq/L కి పడిపోయాయి. ఆయన సెలైన్ (IV fluids), గ్లూకోజ్ తీసుకోవడానికి నిరాకరిస్తూ కేవలం ఓఆర్ఎస్ (ORS), పొటాషియం టాబ్లెట్లు మాత్రమే తీసుకుంటున్నారు.