...
...
Next Story

IMD alert : ఐఎండీ తీపికబురు! వేసవిలో వరుణుడి పలకరింపు- మే నెలలో ఎండలు తక్కువే, కానీ..

May 2026 weather forecast : 2026 వేసవి ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. మే నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వెల్లడించింది. కానీ దక్షిణాది మాత్రం ఎండలు తప్పవని పేర్కొంది.

Published on: May 02, 2026 08:14 AM IST
Advertisement

IMD Heatwave alerts : ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. అయితే, మే నెలలో మాత్రం ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా లేదా సాధారణంగానే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర ప్రకటించారు. ముఖ్యంగా వెస్టర్న డిస్టర్బెన్స్, పిడుగులతో కూడిన వర్షాలు మే నెలలో చల్లదనాన్ని తీసుకురానున్నాయి.

దేశంలో వర్షాల జోరు..

ఐఎండీ మే నెల అప్డేట్స్.. (Sunil Ghosh/HT photo)
ఐఎండీ మే నెల అప్డేట్స్.. (Sunil Ghosh/HT photo)

సాధారణంగా మే నెలలో ఎండలు ముదురుతాయి. కానీ ఈసారి వాతావరణం భిన్నంగా ఉండబోతోంది! మార్చి నుంచి వెస్టర్న డిస్టర్బెన్స్ ప్రభావం పెరుగుతూ వస్తోందని, అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమ వీటిని మరింత బలోపేతం చేస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. దీనివల్ల దేశవ్యాప్తంగా మే నెలలో కురిసే సగటు వర్షపాతం సాధారణం కంటే 110 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా మే నెలలో 61.4 ఎంఎం వర్షపాతం నమోదవుతుంది, కానీ ఈసారి అది భారీగా పెరగనుంది.

దక్షిణాదిలో ఎండల ప్రభావం ఎలా ఉంటుంది?

దేశవ్యాప్తంగా చల్లటి వాతావరణం ఉంటుందని చెబుతున్నా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం సెగలు తప్పవు! ముఖ్యంగా దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని పలు ప్రాంతాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా), ఈశాన్య, వాయువ్య భారత్‌లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండొచ్చు. అయితే, రాత్రి పూట ఉష్ణోగ్రతలు మాత్రం దేశంలోని చాలా చోట్ల సాధారణం కంటే అధికంగానే ఉండే అవకాశం ఉంది.

ఏప్రిల్ నెల దక్షిణ భారతదేశానికి గత ఏడేళ్లలో అత్యంత వేడి కలిగిన ఏప్రిల్‌గా రికార్డు సృష్టించడం గమనార్హం. ఇక్కడ సాధారణం కంటే 51.1 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

ఐఎండీ మే వెదర అప్డేట్స్..

ఎల్ నినో ముప్పు పొంచి ఉందా?

మే 14 నుంచి 20 మధ్య బంగాళాఖాతంలో నైరుతి గాలులు బలపడనున్నాయి. సాధారణంగా మే 20 నాటికి అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. మే తొలి వారంలో ఈశాన్య భారత్‌లో వర్షాలు ఎక్కువగా ఉంటాయని, రెండో వారంలో వాయువ్య భారత్‌లో ఎండలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పిడుగులు, ధూళి తుపానుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. మే నెలలో ఎండలు ఎందుకు తగ్గుతున్నాయి?

పశ్చిమ విక్షోభాల (Western Disturbances) ప్రభావం పెరగడం, అరేబియా సముద్రం నుంచి తేమ గాలులు రావడం వల్ల దేశవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. దీనివల్ల ఎండల తీవ్రత తగ్గుతుంది.

2. ఎల్ నినో అంటే ఏంటి? ఇది రుతుపవనాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు వేడెక్కే ప్రక్రియ. ఇది భారత దేశంలో రుతుపవన వర్షాలను తగ్గిస్తుంది. అయితే మే నెలలో కురిసే వర్షాలకు దీనికి సంబంధం లేదు.

3. తెలుగు రాష్ట్రాల్లో ఎండల పరిస్థితి ఏంటి?

దక్షిణ భారతదేశంలో భాగమైన తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో ఇక్కడ భారీ వర్షపాత లోటు నమోదైంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe