భారతదేశం తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని (2026) అత్యంత వైభవంగా జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. దేశ సైనిక పటిమను, సాంస్కృతిక వైవిధ్యాన్ని కళ్లకు కట్టే ఈ అద్భుత ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రజల్లో ఎంతో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి ప్రారంభమైన పరేడ్ టికెట్ల విక్రయాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం కొన్ని గంటల్లోనే తొలిరోజు కేటాయించిన కోటా మొత్తం అయిపోవడం విశేషం.
నిమిషాల్లోనే ఖాళీ.. అధికారుల ఆశ్చర్యం

గణతంత్ర వేడుకల కోసం కేటాయించిన రోజువారీ 2,225 టికెట్లు అమ్మకాలు మొదలైన కొద్దిసేపటికే అమ్ముడయ్యాయని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే జనవరి 29న జరిగే 'బీటింగ్ రిట్రీట్' వేడుకకు సంబంధించి 692 టికెట్లు కూడా నిమిషాల వ్యవధిలోనే క్లోజ్ అయ్యాయి. ఈ ఏడాది వేడుకలను వీక్షించేందుకు ప్రజలు ఎంత ఆసక్తిగా ఉన్నారో ఈ రద్దీని చూస్తుంటే అర్థమవుతోంది.
టికెట్ల ధరలు ఇవే:
కర్తవ్య పథ్లో జరిగే ఈ వేడుకల కోసం టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించారు:
- రిపబ్లిక్ డే పరేడ్ (జనవరి 26): రూ. 20, రూ. 100.
- బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రెస్ రిహార్సల్ (జనవరి 28): రూ. 20.
- మెయిన్ బీటింగ్ రిట్రీట్ సెర్మనీ (జనవరి 29): రూ. 100.
ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా?
మీరు ఇంటి నుంచే సులభంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీనికోసం రక్షణ శాఖ ప్రత్యేకంగా 'ఆమంత్రణ్' (Aamantran) పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది.
వెబ్సైట్ సందర్శన: ముందుగా www.aamantran.mod.gov.in వెబ్సైట్లోకి వెళ్లండి.
రిజిస్ట్రేషన్: మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. మీ ఫోన్కు వచ్చే OTPని ఎంటర్ చేయండి.
వివరాల నమోదు: మీ ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు వివరాలను అప్లోడ్ చేయండి.
{{/usCountry}}వివరాల నమోదు: మీ ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు వివరాలను అప్లోడ్ చేయండి.
{{/usCountry}}చెల్లింపు: మీకు కావలసిన ఈవెంట్ (పరేడ్ లేదా బీటింగ్ రిట్రీట్) ఎంచుకుని, ఆన్లైన్లో డబ్బులు చెల్లించి టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
గమనిక: మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కూడా వస్తున్నట్లయితే, వారి వివరాలను కూడా 'గెస్ట్ లిస్ట్'లో ముందే చేర్చాల్సి ఉంటుంది.
ఆఫ్లైన్ కౌంటర్లు ఎక్కడ ఉన్నాయి?
నేరుగా వెళ్లి టికెట్లు కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ఢిల్లీలో 6 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి.
- సేనా భవన్: గేట్ నంబర్ 5 సమీపంలో.
- శాస్త్రి భవన్: గేట్ నంబర్ 3 సమీపంలో.
- జంతర్ మంతర్: మెయిన్ గేట్ వద్ద.
- పార్లమెంట్ హౌస్: రిసెప్షన్ కౌంటర్.
- రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్: గేట్ నంబర్ 3 & 4 (డి బ్లాక్).
- కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్: గేట్ నంబర్ 8 సమీపంలో.
ముఖ్యమైన సూచన: టికెట్లు కొనేటప్పుడు మీ ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటివి) తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. పరేడ్ రోజున కూడా ఇదే ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది.
జనవరి 14వ తేదీ వరకు ఈ విక్రయాలు కొనసాగుతాయి. అయితే రోజువారీ కోటా త్వరగా ముగిసిపోతోంది కాబట్టి, పరేడ్ చూడాలనుకునే వారు వీలైనంత త్వరగా తమ టికెట్లను రిజర్వ్ చేసుకోవడం ఉత్తమం.
టికెట్లు మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు తిలకించేందుకు పాస్లు కూడా లభిస్తాయి.