కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె రాసిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్, చైనా చొరబాట్లకు సంబంధించిన కీలక అంశాలను తొలగించాలని ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా (PRHI) ఒత్తిడి తెచ్చింది. అయితే, తన జీవితకథలో ఎలాంటి మార్పులు లేదా తొలగింపులకు ఒప్పుకునేది లేదని సోనియా తేల్చిచెప్పడంతో ఆ సంస్థతో ఒప్పందం రద్దయింది.
ఆల్ఫ్రెడ్ ఏ నాఫ్ ఆధ్వర్యంలో గ్లోబల్ రిలీజ్

పెంగ్విన్ ఇండియా వెనక్కి తగ్గినప్పటికీ, పెంగ్విన్ అంతర్జాతీయ విభాగమైన 'ఆల్ఫ్రెడ్ ఏ నాఫ్' (Alfred A Knopf) ఈ పుస్తకాన్ని నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిశ్చయించింది. భారత్లో ఈ పుస్తక ప్రచురణ, పంపిణీ హక్కుల కోసం హార్పర్ కాలిన్స్ సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది. 79 ఏళ్ల సోనియా గాంధీ తన రాజకీయ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలు, ప్రధాని మోదీతో భేటీలకు సంబంధించిన వివరాలను పుస్తకంలో సమగ్రంగా పొందుపరిచారు. ముఖ్యంగా 2004 గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ తనను ఉద్దేశించి చేసిన "జెర్సీ ఆవు" వ్యాఖ్యల ప్రస్తావనను కూడా ఆమె గుర్తుచేసుకున్నారు.
చైనా చొరబాట్లు, ఆర్ఎస్ఎస్పై వివాదాస్పద భాగాలు
ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, సరిహద్దుల్లో చైనా చొరబాట్లపై సోనియా రాసిన భాగాలపై పెంగ్విన్ ఇండియా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రధానంగా 3-4 పేరాలను పూర్తిగా తొలగించాలని పట్టుబట్టింది. ప్రధాని మోదీని ఇతర మాజీ ప్రధానమంత్రులతో పోలుస్తూ సోనియా చేసిన విశ్లేషణలు, వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద చైనా ఆక్రమణలపై రాసిన పాఠాలు వివాదానికి మూలంగా మారాయి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు గతంలోనూ సరిహద్దు భద్రతపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని గట్టిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
పెంగ్విన్ వివరణ.. కాంగ్రెస్ ఘాటు కౌంటర్
ఈ వివాదంపై పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పందిస్తూ.. "ఎడిటోరియల్ మార్పుల ప్రతిపాదనల వల్లే పుస్తకాన్ని ప్రచురించడం లేదనుకోవడం సరికాదు. పుస్తక నాణ్యతను కాపాడటం, ఫ్యాక్ట్-చెక్ చేయడం ప్రచురణకర్తగా మా బాధ్యత" అని వివరణ ఇచ్చింది. అయితే ఈ వాదనను కాంగ్రెస్ తీవ్రంగా తోసిపుచ్చింది. "గ్లోబల్ పెంగ్విన్ సంస్థ పుస్తకాన్ని ప్రచురిస్తున్నప్పుడు, ఇండియా పెంగ్విన్ ఫ్యాక్ట్-చెక్ పేరు చెప్పడం విడ్డూరంగా ఉంది" అని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ స్పందిస్తూ.. "పీఎం మోదీ రాసిన 'ఎగ్జామ్ వారియర్స్', ఆర్ఎస్ఎస్పై పుస్తకాలను ప్రచురించడానికి ఉత్సాహపడే పెంగ్విన్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి భయపడి సోనియా పుస్తకం విషయంలో వెనకడుగు వేసింది," అని ఆరోపించారు.
గతంలో నరవణే పుస్తకంపై ఇలాగే వివాదం
{{/usCountry}}ఈ వివాదంపై పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పందిస్తూ.. "ఎడిటోరియల్ మార్పుల ప్రతిపాదనల వల్లే పుస్తకాన్ని ప్రచురించడం లేదనుకోవడం సరికాదు. పుస్తక నాణ్యతను కాపాడటం, ఫ్యాక్ట్-చెక్ చేయడం ప్రచురణకర్తగా మా బాధ్యత" అని వివరణ ఇచ్చింది. అయితే ఈ వాదనను కాంగ్రెస్ తీవ్రంగా తోసిపుచ్చింది. "గ్లోబల్ పెంగ్విన్ సంస్థ పుస్తకాన్ని ప్రచురిస్తున్నప్పుడు, ఇండియా పెంగ్విన్ ఫ్యాక్ట్-చెక్ పేరు చెప్పడం విడ్డూరంగా ఉంది" అని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ స్పందిస్తూ.. "పీఎం మోదీ రాసిన 'ఎగ్జామ్ వారియర్స్', ఆర్ఎస్ఎస్పై పుస్తకాలను ప్రచురించడానికి ఉత్సాహపడే పెంగ్విన్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి భయపడి సోనియా పుస్తకం విషయంలో వెనకడుగు వేసింది," అని ఆరోపించారు.
గతంలో నరవణే పుస్తకంపై ఇలాగే వివాదం
{{/usCountry}}పెంగ్విన్ సంస్థ గతంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే ఆత్మకథ విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించింది. నరవణే రాసిన పుస్తకంలో చైనా చొరబాట్ల సమయంలో రాజకీయ నాయకత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోకుండా సైన్యాన్ని ఒంటరిని చేసిందని పేర్కొన్న భాగాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడేందుకు ప్రయత్నించగా, సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.