టీ20 ప్రపంచకప్ ఫైనల్.. అది కూడా న్యూజిలాండ్ లాంటి టఫ్ అపోనెంట్ తో మ్యాచ్. కానీ దీన్ని ఓ గల్లీ మ్యాచ్ లా మార్చేస్తూ.. కివీస్ బౌలర్లను అనామక బౌలర్లుగా మార్చేస్తూ.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత బ్యాటర్లు వీర విధ్వంసం సృష్టించారు. సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఆదివారం (మార్చి 8) ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగులు చేసింది.

సంజు శాంసన్ (46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు 52), శివమ్ దూబె (8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) అదరగొట్టారు.
అభిషేక్ అదుర్స్
ఆదివారం టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. ఇండియాను బ్యాటింగ్ ఆహ్వానించింది. అది ఎంత పెద్ద తప్పో కివీస్ కు త్వరగానే తెలిసొచ్చింది. ఈ టోర్నీలో తీవ్రంగా నిరాశపర్చిన అభిషేక్ శర్మ ఫైనల్లో మాత్రం చెలరేగిపోయాడు. ఆఫ్ స్పిన్నర్ ట్రాప్ లో మరోసారి అభిషేక్ ను పడేయాలని చూసినా ఈ సారి మాత్రం ఈ ఓపెనర్ దొరకలేదు.
సాలిడ్ ఓపెనింగ్
సూపర్ ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ కు అభిషేక్ శర్మ తోడవడంతో ఇండియాకు సాలిడ్ ఓపెనింగ్ దక్కింది. ఈ ఇద్దరు కలిసి పవర్ ప్లేలో పెను విధ్వంసం సృష్టించారు. సింగిల్స్ కంటే కూడా సిక్సర్లు బాదడంపైనే ఇద్దరూ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా అభిషేక్ తన కసినంతా ఫైనల్ కోసమే దాచుకున్నట్లు రెచ్చిపోయాడు. డఫీ వేసిన ఓవర్లో అభిషేక్ మూడు ఫోర్లో, ఓ సిక్సర్ బాదాడు. పవర్ ప్లే ముగిసే సరికే ఇండియా 6 ఓవర్లలో 92 పరుగులు చేసింది.
ఇషాన్ తుపాన్
18 బాల్స్ లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసిన అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్, శాంసన్ కలిసి బాదుడు కొనసాగించారు. 8వ ఓవర్లోనే టీమ్ స్కోరు 100 దాటింది. ఈ మ్యాచ్ లో ఇండియా 300 స్కోరు కొడుతుందేమో అనిపించింది. ఇషాన్, శాంసన్ పోటీపడి మరీ సిక్సర్లు బాదాడు. ఇషాన్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయగా, శాంసన్ సెంచరీ వైపు దూసుకెళ్లాడు.
మూడు వికెట్లు
{{/usCountry}}18 బాల్స్ లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసిన అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్, శాంసన్ కలిసి బాదుడు కొనసాగించారు. 8వ ఓవర్లోనే టీమ్ స్కోరు 100 దాటింది. ఈ మ్యాచ్ లో ఇండియా 300 స్కోరు కొడుతుందేమో అనిపించింది. ఇషాన్, శాంసన్ పోటీపడి మరీ సిక్సర్లు బాదాడు. ఇషాన్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయగా, శాంసన్ సెంచరీ వైపు దూసుకెళ్లాడు.
మూడు వికెట్లు
{{/usCountry}}ఫుల్ జోష్ తో సాగుతున్న ఇండియన్ ఇన్నింగ్స్ కు నీషమ్ బ్రేక్ వేశాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు తీశాడు. శాంసన్, ఇషాన్ కిషన్ తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ (0)ను నీషమ్ ఔట్ చేశాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడటంతో ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. స్కోరు స్పీడ్ తగ్గిపోయింది.
దూబె విధ్వంసం
తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (13 బంతుల్లో 18) వేగంగా ఆడలేకపోయారు. స్కోరు 250 దాటడం కూడా కష్టంగా కనిపించింది. జనరల్ గా అయితే టీ20ల్లో 200 దాటడం బిగ్ స్కోరే. కానీ ఇండియాకు వచ్చిన ఓపెనింగ్ తో హైప్ పెరిగిపోయింది. అయితే ఆఖరి ఓవర్లో దూబె వీర విహారం చేశాడు. వరుసగా 4, 6, 6, 4 బాది టీమ్ స్కోరును 250 దాటించాడు. లాస్ట్ బాల్ కు ఫోర్ కొట్టాడు.