హైదరాబాద్ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగం తిరిగి పాత రికార్డులను తిరగరాస్తోంది. నగరంలో ఆఫీస్ స్థలాలకు డిమాండ్ ఎంత బలంగా ఉందో చాటిచెబుతూ మరో మెగా లీజింగ్ డీల్ పూర్తయింది. ప్రముఖ మేనేజ్డ్ వర్క్స్పేస్ సొల్యూషన్స్ సంస్థ 'టేబుల్స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్' (Tablespace Technologies Ltd) హైదరాబాద్లో దాదాపు 5.06 లక్షల చదరపు అడుగుల వి విస్తీర్ణంలో ఉన్న భారీ ఆఫీస్ స్పేస్ను ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది.

రియల్ ఎస్టేట్ సమాచార సంస్థ 'ప్రాప్స్టాక్' (Propstack) సేకరించిన పత్రాల ప్రకారం.. ఈ లీజు కాలంలో కంపెనీ మొత్తం రూ.163.3 కోట్లను అద్దె రూపంలో చెల్లించనుంది. జూన్ 27, 2026న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగా, జూలై 1, 2026 నుంచే ఈ లీజు అమల్లోకి వచ్చింది.
ఒప్పందం వివరాలు & అద్దె లెక్కలు
లక్ష్మీ ఇన్ఫోబాన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఎల్ఎల్పీకి చెందిన ప్రాపర్టీలో టేబుల్స్పేస్ ఈ స్థలాన్ని దక్కించుకుంది. ఐటీ పార్క్లోని టవర్ 5లో మూడు అంతస్తులు, టవర్ 6లో ఎనిమిది అంతస్తులను కంపెనీ లీజుకు తీసుకుంది.
చదరపు అడుగుకు నెలకు రూ.56 చొప్పున టేబుల్స్పేస్ అద్దె చెల్లిస్తుంది. దీని ప్రకారం ప్రతినెల అద్దె రూ.2.84 కోట్లు అవుతుంది. ఈ ఒప్పందం కోసం కంపెనీ రూ.28.35 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్గా సమర్పించింది. ఒప్పంద నిబంధనల ప్రకారం, ప్రతీ మూడేళ్లకు అద్దెను 15 శాతం చొప్పున పెంచుతారు. అయితే, అద్దె చెల్లింపుల ప్రక్రియ (RCD) జనవరి 1, 2027 నుంచి ప్రారంభం కానుంది.
రూ.800 కోట్ల ఐపీఓకి టేబుల్స్పేస్ సన్నాహాలు
ఒకవైపు దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరిస్తూనే, మరోవైపు మార్కెట్ నుంచి నిధుల సమీకరణకు టేబుల్స్పేస్ సిద్ధమవుతోంది. రూ.800 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ద్వారా నిధులు సేకరించేందుకు ఆగస్టు 11, 2026న స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI)కి కంపెనీ డ్రాఫ్ట్ పేపర్లు (DRHP) దాఖలు చేసింది.
హైదరాబాద్ మార్కెట్పై టేబుల్స్పేస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మే 2026లోనే కోకపేట్లోని నియోపోలిస్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఉన్న గ్రావా బిజినెస్ పార్క్లో 4 లక్షల చదరపు అడుగులతో సహా మొత్తం 5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని తన పోర్ట్ఫోలియోకు జత చేసింది.
దేశవ్యాప్తంగా విస్తరణ జోరు
{{/usCountry}}హైదరాబాద్ మార్కెట్పై టేబుల్స్పేస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మే 2026లోనే కోకపేట్లోని నియోపోలిస్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఉన్న గ్రావా బిజినెస్ పార్క్లో 4 లక్షల చదరపు అడుగులతో సహా మొత్తం 5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని తన పోర్ట్ఫోలియోకు జత చేసింది.
దేశవ్యాప్తంగా విస్తరణ జోరు
{{/usCountry}}హైదరాబాద్తో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ టేబుల్స్పేస్ తన ముద్రను విస్తరిస్తోంది.
గుర్గ్రామ్: మార్చి 2026లో గుర్గ్రామ్ సెక్టార్ 42 ఉన్న 'గోద్రెజ్ జీసీఆర్' భవనంలో ముంజాల్ హాస్పిటాలిటీ నుంచి 1.45 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని నెలకు రూ.2.85 కోట్ల అద్దెతో లీజుకు తీసుకుంది.
మరొక డీల్: సెక్టార్ 59లోని ఇంటెలియన్ పార్క్లో నెలకు రూ.3.47 కోట్ల అద్దెతో 5.34 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ స్థలాన్ని గూగుల్ (Google) సంస్థకు సబ్-లీజు ఇచ్చేందుకు ప్రతిపాదించారు.
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో (FY 2025) ముంబైలో కంపెనీ కార్యకలాపాలు 50 శాతం పెరిగాయి. అక్కడ తమ ప్రాపర్టీ వైశాల్యాన్ని 4.7 లక్షల చదరపు అడుగుల నుంచి 7 లక్షల చదరపు అడుగులకు పెంచుకున్నట్లు మార్చి 6న ప్రకటించింది.
దూసుకుపోతున్న ఆఫీస్ స్పేస్ లీజింగ్ మార్కెట్
రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ (CBRE) నివేదిక ప్రకారం, 2026 రెండో త్రైమాసికంలో (Q2 2026) భారత ఆఫీస్ మార్కెట్ ఆల్-టైమ్ రికార్డును నమోదు చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన 18 శాతం, ఏడాది ప్రాతిపదికన 14 శాతం వృద్ధితో దాదాపు 2.46 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ పూర్తయింది. ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, పుణె నగరాలు కలిసి జాతీయ స్థాయిలో 58 శాతం వాటాను దక్కించుకోగా, హైదరాబాద్ కూడా మెగా లీజింగ్ ఒప్పందాలతో దేశంలోనే అగ్రగామి ఐటీ డెస్టినేషన్గా నిలుస్తోంది.