అదే ఆధిపత్యం.. అదే విజయం. టీ20 ప్రపంచకప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను టీమిండియా మరోసారి చిత్తుచేసింది. ఆదివారం (ఫిబ్రవరి 15) రాత్రి కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ముగిసిన మ్యాచ్ లో ఇండియా 61 పరుగుల తేడాతో పాక్ పై ఘన విజయం సాధించింది. ఈ విక్టరీ ఇండియా కోసం అని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డిక్లేర్ చేశాడు.
ఇండియా కోసం

పాకిస్థాన్ పై విక్టరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ‘ఇది ఇండియా కోసం’ అని అతను డిక్లేర్ చేశాడు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టిన ఇషాన్ కిషన్ పై సూర్య ప్రశంసలు కురిపించాడు.
‘‘ఇది ఇండియా కోసం. మేం అనుకున్నట్లుగానే ఆడాం. ఈ వికెట్ పై ముందు బ్యాటింగ్ చేయడం మంచిదని టాస్ సమయంలో కూడా చెప్పా. ఇషాన్ ఆడిన తీరు అద్భుతం. ఇషాన్ కొత్తగా ఆలోచించాడు. పవర్ ప్లేలో ఎవరో ఒకరు చెలరేగాలి. ఇషాన్ ఆ బాధ్యత తీసుకున్నాడు. తిలక్, శివమ్, రింకు బ్యాటింగ్ ను కూడా మెచ్చుకోవాల్సిందే’’ అని సూర్యకుమార్ తెలిపాడు.
బెస్ట్ బౌలర్
‘‘మేం ఫస్ట్ 175 రన్స్ చేసినప్పుడే మంచి స్కోరు చేశామని అనుకున్నా. ఓ 20 రన్స్ ఎక్కువే చేశామనిపించింది. హార్దిక్ కొత్త బాల్ తో ఛార్జ్ తీసుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా చెలరేగిపోయాడు. అతను ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ అని మరోసారి చాటాడు. ఆ తర్వాత అక్షర్, వరుణ్, కుల్ దీప్ బౌలింగ్ లో అదరగొట్టారు. తిలక్ కూడా సహకరించాడు’’ అని సూర్య పేర్కొన్నాడు.
మధ్యలోనే మోసిన నఖ్వీ
టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేద్దామనుకున్నాం కానీ ఐసీసీ రిక్వెస్ట్ తో ఆడేందుకు ఒప్పుకొన్నామని తెగ బిల్డప్ ఇస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోసిన నఖ్వీకి తీవ్ర పరాభవం ఎదురైంది. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు అతను కొలంబోలోని స్టేడియానికి వచ్చాడు. కానీ ఇండియా చేతిలో పాక్ చిత్తవుతుంటే చూడలేక మధ్యలోనే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు.
గ్రాండ్ విక్టరీ
{{/usCountry}}టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేద్దామనుకున్నాం కానీ ఐసీసీ రిక్వెస్ట్ తో ఆడేందుకు ఒప్పుకొన్నామని తెగ బిల్డప్ ఇస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోసిన నఖ్వీకి తీవ్ర పరాభవం ఎదురైంది. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు అతను కొలంబోలోని స్టేడియానికి వచ్చాడు. కానీ ఇండియా చేతిలో పాక్ చిత్తవుతుంటే చూడలేక మధ్యలోనే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు.
గ్రాండ్ విక్టరీ
{{/usCountry}}టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఎ పోరులో పాకిస్థాన్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 40 బాల్స్ లోనే 77 రన్న్ కొట్టాడు. స్పిన్ ట్రాప్ లో భారత్ ను పడేయాలని పాక్ చూసింది. ఆ టీమ్ స్పిన్నర్లు ఏకంగా 18 ఓవర్లు వేశారు. కానీ ఇషాన్ మెరుపులతో భారత్ మంచి స్కోరు సాధించింది.
ఛేజింగ్ లో పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు పడగొట్టారు. టీ20 ప్రపంచకప్ లో హ్యాట్రిక్ విజయాలతో ఇండియా సూపర్ 8కు దూసుకెళ్లింది. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నెదర్లాండ్స్తో భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది.