...
...
Next Story

త్వరలో CAT 2025 ఫలితాలు- నెక్ట్స్​ ఏంటి? ఐఐఎం అడ్మిషన్​ ప్రక్రియ ఇది..

క్యాట్ 2025 రాసిన దాదాపు 2.58 లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణ త్వరలో ముగియనుంది. ఫలితాల విడుదల అనంతరం ఐఐఎంలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎంపిక విధానం, కావాల్సిన పత్రాల వివరాలు మీకోసం.

Published on: Dec 22, 2025, 06:46:13 IST
Advertisement

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్- క్యాట్​ 2025 ఫలితాల కోసం నిరీక్షణ కొనసాగుతోంది. జనవరి మొదటి వారం నాటికి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరీక్ష రాసిన సుమారు 2.58 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి ఫలితాలు విడుదలైన తర్వాత ఏంటి? ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతోంది? ఇక్కడ తెలుసుకోండి..

క్యాట్​ 2025 ఫలితాలు- అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది?

త్వరలో క్యాట్​ 2025 ఫలితాలు- నెక్ట్స్​ ఏంటి?
త్వరలో క్యాట్​ 2025 ఫలితాలు- నెక్ట్స్​ ఏంటి?

సాధారణంగా క్యాట్ 2025 స్కోరు ఆధారంగా ఐఐఎంలు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తాయి. అయితే, కేవలం క్యాట్ స్కోరు మాత్రమే కాకుండా ఒక్కో ఐఐఎం తనదైన ప్రత్యేక ఎంపిక విధానాన్ని అనుసరిస్తుందని గుర్తుపెట్టుకోవాలి.

తదుపరి రౌండ్లు: షార్ట్‌లిస్ట్ అయిన వారికి రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ (డబ్ల్యూఏటీ), గ్రూప్ డిస్కషన్ (జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ (పీఐ) వంటి రౌండ్లు ఉంటాయి.

ముఖ్య అంశాలు: అభ్యర్థి గత విద్యా రికార్డులు, వర్క్​ ఎక్స్​పీరియెన్స్​, అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్, జెండర్ డైవర్సిటీ వంటి అంశాలకు కూడా ఐఐఎంలు వెయిటేజీ ఇస్తాయి.

కాల్ లెటర్లు: ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆయా ఐఐఎంల అధికారిక వెబ్‌సైట్లలో ఉంచుతారు. అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ కాల్ లెటర్లు పంపిస్తారు.

  • గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2026: ప్రపంచంలోనే టాప్ 10 బిజినెస్ స్కూల్స్​ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

క్యాట్​ 2025 ఫలితాలు- వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్లు..

ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో అభ్యర్థులు తమ అర్హతను నిరూపించుకోవడానికి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.

రిజర్వేషన్ సర్టిఫికేట్లు: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల (పీడబ్ల్యూడీ) కేటగిరీకి చెందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ కుల/డిజబిలిటీ సర్టిఫికేట్లను తప్పనిసరిగా చూపించాలి.

క్యాట్​ 2025 ఫలితాలు- ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం ప్రత్యేక సూచనలు..

ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ, క్యాట్​ 2025 రాసిన వారు కూడా ఈ అడ్మిషన్లకు అర్హులే! అయితే వారు ఈ కింది నిబంధనలు పాటించాలి:

మీరు చదువుతున్న విద్యాసంస్థ ప్రిన్సిపాల్ లేదా రిజిస్ట్రార్ నుంచి కనీసం 50% మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45%) సాధించినట్లు ధృవీకరణ పత్రం సమర్పించాలి.

ఫలితాల కోసం వేచి చూస్తున్న వారు తాత్కాలికంగా కోర్సులో చేరవచ్చు. అయితే, డిసెంబర్ 31, 2026 లోపు ఒరిజినల్ మార్కు లిస్టులు, డిగ్రీ సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంటుంది.

నిర్ణీత గడువులోపు పత్రాలు సమర్పించకపోయినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా మీ అడ్మిషన్ రద్దవుతుందని గుర్తుంచుకోండి.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆయా ఐఐఎంల అధికారిక వెబ్‌సైట్లలోని అడ్మిషన్ పాలసీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండటం మంచిది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe