"ఈ పందెంలో నేను ఓడిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది," అని జెరోధా కో-ఫౌండర్, సీఈఓ నితిన్ కామత్ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) ద్వారా పంచుకున్నారు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగి అసాధారణ రీతిలో బరువు తగ్గడంతో, తాను కాసిన రూ. 2.5 లక్షల ఫిట్నెస్ బెట్లో ఓడిపోయినట్లు ఆయన వెల్లడించారు.

జెరోధా సంస్థలో కంటెంట్ అండ్ మీడియా స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్న రోహిత్ అగర్వాలా ఏడాది కాలంలో ఏకంగా 30 కిలోల బరువు తగ్గారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నితిన్ కామత్తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ రోహిత్ ఈ విజయాన్ని పంచుకున్నారు. తన జీవితంలో గర్వంగా చెప్పుకునే అతిపెద్ద విషయం నితిన్ కామత్ నుండి హెల్త్ ఛాలెంజ్లో రూ. 2.5 లక్షలు గెలుచుకోవడమేనని రోహిత్ రాసుకొచ్చారు.
"ఈ పందెంలో వచ్చిన డబ్బు కంటే నా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, ఏడాదిలో 30 కిలోల బరువు తగ్గడమే నాకు దక్కిన అతిపెద్ద బహుమతి. జెరోధా వంటి సంస్థలోనే ఇలాంటి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి" అని రోహిత్ అగర్వాలా ఆనందం వ్యక్తం చేశారు.
104 కిలోల నుండి 74 కిలోలకు..
రోహిత్ తన ఫిట్నెస్ ప్రయాణం గురించి మరో ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్లో ఆయన బరువు 104 కిలోలుగా ఉండేది. అప్పటికే బరువు తగ్గడానికి ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న రోహిత్కు ఫిట్గా మారడం ఒక కలలా అనిపించింది. అయితే జెరోధా సంస్థలో ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణం ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కంపెనీ యాజమాన్యం ఉద్యోగుల ఆరోగ్యంపై మొదటి నుండి ప్రత్యేక శ్రద్ధ పెడుతుండటంతో రోహిత్ దీనిని సీరియస్గా తీసుకున్నారు.
సహోద్యోగులతో మరో పందెం
ఆ తర్వాత జూన్ నెలలో రోహిత్ తన బరువును 95 కిలోలకు తగ్గించారు. ఆ సమయంలో తనతో పనిచేసే మరో 15 మంది సహోద్యోగులు ఆయనకు ఒక ఛాలెంజ్ విసిరారు. జనవరి నాటికి బరువును 95 కిలోల నుండి 75 కిలోలకు తగ్గించాలని, అలా తగ్గితే రూ. 1 లక్ష ఇస్తామని పందెం కాశారు. అన్హెల్తీగా ఉన్న ఉద్యోగులను ప్రోత్సహించడానికి జెరోధా బృందం ఈ రకమైన పందాలను ఏర్పాటు చేసింది. రోహిత్ జనవరి 8 నాటికి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 74.5 కిలోల బరువుకు చేరుకుని పందెంలో విజయం సాధించారు.
సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
{{/usCountry}}ఆ తర్వాత జూన్ నెలలో రోహిత్ తన బరువును 95 కిలోలకు తగ్గించారు. ఆ సమయంలో తనతో పనిచేసే మరో 15 మంది సహోద్యోగులు ఆయనకు ఒక ఛాలెంజ్ విసిరారు. జనవరి నాటికి బరువును 95 కిలోల నుండి 75 కిలోలకు తగ్గించాలని, అలా తగ్గితే రూ. 1 లక్ష ఇస్తామని పందెం కాశారు. అన్హెల్తీగా ఉన్న ఉద్యోగులను ప్రోత్సహించడానికి జెరోధా బృందం ఈ రకమైన పందాలను ఏర్పాటు చేసింది. రోహిత్ జనవరి 8 నాటికి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 74.5 కిలోల బరువుకు చేరుకుని పందెంలో విజయం సాధించారు.
సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
{{/usCountry}}నితిన్ కామత్ పెట్టిన ఈ పోస్ట్కు నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. డబ్బులు ఓడిపోయినా, ఒక మనిషి జీవితాన్ని గెలిపించారంటూ నితిన్ కామత్ను నెటిజన్లు కొనియాడుతున్నారు. "పందెంలో ఓడిపోయినా లైఫ్స్టైల్ లో గెలిచారు. రోహిత్ సాధించిన ఈ 30 కిలోల వెయిట్ లాస్ అద్భుతం. నితిన్ భాయ్, డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదు" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. కార్పొరేట్ కంపెనీల్లో ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం వల్ల ఉద్యోగులు సుదీర్ఘకాలం ఫిట్గా ఉండటానికి ప్రేరణ లభిస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.