మన హిందూ సంప్రదాయంలో దానధర్మాలకు ఎంత విశిష్టత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దానం చేయడం వలన అపారమైన పుణ్యం లభిస్తుంది. పురాణాలు, శాస్త్రాల ప్రకారం దానాలు చేయడానికి కొన్ని నియమాలు, సమయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా కచ్చితంగా పాటించేటట్టు చూడాలి. ఏ సమయంలో పడితే ఆ సమయంలో దానం చేయడం వలన పుణ్యానికి బదులు పాపం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా ఈ విషయంలో హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తర్వాత కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఇతరులకు ఇవ్వకూడదు. దాని వలన ఇంట్లో లక్ష్మీదేవి వెళ్లిపోతుంది, ఐశ్వర్యం తగ్గిపోతుంది. సాయంత్రం వేళ ప్రదోషకాలంలో పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకండి. సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ ఐదు వస్తువులను ఇతరులకు ఇస్తే దరిద్రం తప్పదు అని గుర్తుపెట్టుకోండి.
పొరపాటున కూడా సూర్యాస్తమయం అయ్యాక ఈ వస్తువులను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చూసుకోండి
1.పసుపు
పసుపును హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా, శుభానికి చిహ్నంగా భావిస్తాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు గురు గ్రహానికి ప్రతిరూపం. సూర్యాస్తమయం అయిన తర్వాత పసుపును ఎవరికీ కూడా ఇవ్వకూడదు, దానం చేయకూడదు. అలా చేయడం వలన గురు బలం క్షీణిస్తుంది. గురు గ్రహం ప్రభావం తగ్గినట్లయితే వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయి, నష్టాలు కలుగుతాయి. ఆర్థికపరంగా కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. శుభకార్యాలు ఆగిపోవడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది.
2.పెరుగు
పెరుగు మనశ్శాంతి, సంపదకు, చల్లదనానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే పెరుగు అనేది శుక్ర గ్రహానికి, చంద్రుడికి సంబంధించినది. చీకటి పడ్డాక పెరుగును ఇతరులకు ఇవ్వకూడదు. ఇంటి ప్రగతి కుంటుపడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పెరుగును సాయంత్రం ఎవరికైనా ఇవ్వడం వలన తగ్గిపోతుంది. పెరుగును రాత్రిపూట ఎవరికీ ఇవ్వకండి. అప్పుడు శుభ ఫలితాలను చూడవచ్చు.
3.ఉప్పు
వాస్తు ప్రకారం ఉప్పు ప్రతికూల శక్తిని తగ్గించి, సానుకూల శక్తిని తీసుకువస్తుంది. స్థిరత్వానికి, ఆర్థిక ఎదుగుదలకు ఉప్పు సంకేతం. సాయంత్రం పూట ఎవరికి అప్పుగా ఉప్పును ఇవ్వకండి. దీనివలన సానుకూల శక్తి తగ్గి, ప్రతికూల శక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. ప్రశాంతత కూడా కరువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఎవరైనా చీకటి పడ్డాక ఉప్పును అడిగితే కూడా ఇవ్వకండి.
4.డబ్బులు
{{/usCountry}}వాస్తు ప్రకారం ఉప్పు ప్రతికూల శక్తిని తగ్గించి, సానుకూల శక్తిని తీసుకువస్తుంది. స్థిరత్వానికి, ఆర్థిక ఎదుగుదలకు ఉప్పు సంకేతం. సాయంత్రం పూట ఎవరికి అప్పుగా ఉప్పును ఇవ్వకండి. దీనివలన సానుకూల శక్తి తగ్గి, ప్రతికూల శక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. ప్రశాంతత కూడా కరువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఎవరైనా చీకటి పడ్డాక ఉప్పును అడిగితే కూడా ఇవ్వకండి.
4.డబ్బులు
{{/usCountry}}చీకటి పడ్డాక ఎవరికి డబ్బులు ఇవ్వడం మంచిది కాదు. డబ్బును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. రోజంతా కష్టపడి సంపాదిస్తాము. లక్ష్మీదేవిని సాయంత్రం ఇతరులకు అప్పుగా ఇవ్వడం లేదా దానంగా ఇవ్వడం మంచిది కాదు. చీకటి పడే సమయంలో ఎవరికైనా డబ్బు ఇస్తే అదృష్టం తగ్గిపోతుంది. పేదరికంతో బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పొరపాటు కూడా చేయకుండా చూసుకోవాలి.
5.పాలు
పాలు విష్ణువుతో పాటు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. క్షీరసాగరం నుంచి ఉద్భవించిన లక్ష్మీ అనుగ్రహం పాలలో ఉంటుంది. చీకటి పడ్డాక ఎవరికి పాలను ఇవ్వకూడదు. లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. సంపద కూడా కరిగిపోతుంది.
సాయంత్రం పూట వీటిని కూడా పాటిస్తే మంచిది
చీకటి పడే సమయంలో ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు. లక్ష్మీదేవి ఆ సమయంలో మన ఇంటికి వస్తుంది కాబట్టి తలుపులను తెరిచి ఉంచాలి. కుదిరితే సాయంత్రం సింహద్వారం దగ్గర దీపాన్ని వెలిగించండి. ఇంట్లో లైట్లను ఆన్ చేసి పెట్టండి. చీకటి లేకుండా చూసుకోండి. అలాగే సాయంత్రం పూట తులసి ఆకులను తెంపకూడదు. అలా చేయడం వలన పాపం కలుగుతుంది.