పూర్వఫల్గుని నక్షత్రంలోకి బుధుడు - ఇవాళ్టి నుంచి అదృష్టం చూడబోయే 5 రాశులివే!
శుక్రుడి నక్షత్రమైన పూర్వ ఫాల్గుణిలోకి బుధుడు ప్రవేశించాడు. సెప్టెంబర్ 5 వరకు కొనసాగే ఈ బుధ సంచారం వల్ల మిథునం, తుల, మకరం, వృషభం సహా 5 రాశుల వారికి లక్ష్మీకటాక్షం లభిస్తుంది.
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కదలికలు, రాశి మరియు నక్షత్ర పరివర్తనలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బుద్ధి, వ్యాపారం, వాక్కు మరియు తార్కిక శక్తికి కారకుడైన గ్రహాల యువరాజు 'బుధుడు' తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. ప్రస్తుతం సూర్యుడికి చెందిన సింహరాశిలో సంచరిస్తున్న బుధుడు…. నేటి నుంచి శుక్రుడికి చెందిన 'పూర్వ ఫాల్గుణి' నక్షత్రంలోకి ప్రవేశించాడు.

హిందూ క్యాలెండర్, పంచాంగం ప్రకారం….. బుధుడు సెప్టెంబర్ 5, 2026 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. జ్యోతిష్య నిపుణుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐశ్వర్యానికి, భోగభాగ్యాలకు అధిపతి అయిన శుక్రుడి నక్షత్రంలోకి బుధుడు చేరడం వల్ల రాబోయే 7 రోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం మెరిసి, ఊహించని ధనలాభం కలగనుంది. ఆ అదృష్ట రాశుల వివరాలు, వాటి ఫలితాలు ఇవే…
1. మిథున రాశి :
మిథున రాశి వారికి ఈ నక్షత్ర సంచారం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. మీ రాశి అధిపతి బుధుడే కావడం వల్ల ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఆర్థికంగా మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో నూతన బాధ్యతలు లభిస్తాయి. మీరు కనబరిచే ప్రతిభ వల్ల ఉద్యోగంలో పదోన్నతి (ప్రమోషన్) లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సంపద పెరిగి, కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.
2. తులా రాశి :
తులా రాశి వారికి బుధుడి నక్షత్ర మార్పు అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. చాలా కాలం తర్వాత ఆత్మీయ స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం బంగారు అవకాశాలను తెచ్చిపెడుతుంది. కొత్త ప్రాజెక్టులు దక్కడం లేదా పాత వ్యాపారాల నుంచి లాభాలు రావడం ద్వారా మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది.
3. మకర రాశి :
మకర రాశి జాతకులకు కూడా ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి, దాంపత్య జీవితంలో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు సంబంధించిన శుభవార్తలు వింటారు. నిలిచిపోయిన పనులు వేగవంతమై లాభాలను అందిస్తాయి.
4. వృషభ రాశి :
వృషభ రాశి వారికి ఈ సమయం శుభప్రదంగా నిలుస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఎంతో అనుకూలమైన కాలం. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు క్రమక్రమంగా తొలగిపోతాయి. కొత్త రాబడి మార్గాలు సుగమం కావడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
బుధుడి ఈ నక్షత్ర సంచారం సెప్టెంబర్ 5 వరకు కొనసాగుతుండటంతో…. ఈ 5 రాశుల వారు సద్వినియోగానికి తగిన ప్రణాళికలు చేసుకుంటే వ్యాపార, ఉద్యోగాల్లో అద్భుతమైన పురోగతిని సాధించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

