Birds On Roof : ఇంటి పైకప్పు మీద పక్షులు కనిపించడం శుభమా? అశుభమా?
పక్షులు కొన్ని రోజుల పాటు మీ ఇంటి పైకప్పు మీద కూర్చుని గట్టిగా అరుస్తూ ఉంటే మనసులో ఆలోచనలు రావడం సహజం. ఏ రకమైన పక్షులు ఇంటి పైకప్పు మీదకు వచ్చి కూర్చోవడం అశుభం?
సనాతన ధర్మంలో జంతువులకు, పక్షులకు ఆహారం, నీరు పెట్టడం శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే మన ఇంటి పైకప్పుపై కొన్ని పక్షులు కనిపిస్తే అది అశుభమని నమ్ముతారు. కొన్ని పక్షులు మీ ఇంటి పైకప్పుపై కూర్చుని ఏడుస్తూ, వింత శబ్దాలు చేస్తుంటే దానిని శుభశకునంగా పరిగణించలేరు. ఇవి మన భవిష్యత్తు గురించి కొన్ని సూచనలు ఇస్తున్నాయని నమ్మకం. మనం ఈ సంకేతాలను సరిగ్గా గమనించి అప్రమత్తంగా ఉండాలి. ఈ పక్షులు మీకు త్వరలో ఆర్థిక, కుటుంబ, ఇతర సమస్యలు వస్తాయని సూచిస్తాయి. మీ ఇంటి పైకప్పుపై కూర్చుని ఏడుస్తున్నా లేదా గట్టిగా అరుస్తున్నా ఏ పక్షి అశుభమో తెలుసుకుందాం.

ఒకవేళ రాబందు లేదా గద్ద పదేపదే మీ ఇంటి పైకప్పు మీదకు వచ్చి కూర్చుని అరిస్తే.. అది శుభశకునంగా పరిగణించరు. దీనివల్ల మీ ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుందని నమ్ముతారు. గబ్బిలాలు పదేపదే వచ్చి ఇంటిలోని ఏ భాగం మీదైనా లేదా పైకప్పు మీదైనా కూర్చుంటే, అది చాలా అశుభంగా పరిగణిస్తారు.
ఒకవేళ గుడ్లగూబ మీ ఇంటి పైకప్పు మీదకు వచ్చి కొన్ని రోజుల పాటు నిరంతరం అరుస్తూ ఉన్నా లేదా వింత శబ్దాలు చేసినా దీనిని కూడా శుభసూచకంగా పరిగణించరు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు అశుభ సంకేతం. సాధారణంగా ఇంటి పైకప్పు మీద కాకి కనిపిస్తే, అది అతిథుల రాకకు సంకేతమని చాలామంది నమ్ముతారు. అయితే ఆ కాకి మీ ఇంటికి దక్షిణం వైపు తిరిగి శబ్దం చేస్తే.. అది అశుభంగా పరిగణించరు. ఇది కాకుండా తీతువు పిట్ట మీ ఇంటి పైకప్పు మీదకు వచ్చి అరవడం కూడా అశుభం.
ఇంటి పైకప్పు మీద గబ్బిలాలు లేదా రాబందులు వాలి, పదేపదే అరవడం లేదా ఏడవడం ప్రారంభిస్తే, మీరు త్వరలో పేదరికాన్ని ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది. ఇది ఆర్థిక సమస్యలకు సంకేతం. ఒక కాకి మీ ఇంటికి దక్షిణ దిశలో వాలి అరవడం ప్రారంభిస్తే.. అది కుటుంబంలో కొంత అసమ్మతి లేదా కలహానికి సంకేతం కావచ్చు. ఇది గౌరవం తగ్గడానికి కూడా ఒక సంకేతంగా పరిగణిస్తారు. కుటుంబంలోని ఎవరైనా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని కూడా ఇది సూచిస్తుంది.
ఈ పక్షులలో ఏవైనా మీ ఇంటి పైకప్పు మీద పదేపదే కిచకిచలాడుతుంటే.. మీరు చేయవలసిన మొదటి పని పైకప్పును శుభ్రం చేయడం. అక్కడ ఏదైనా చెత్త లేదా ఎండు కట్టెలు ఉంటే వాటిని తొలగించండి. పక్షులను ఇంట్లో పంజరంలో ఉంచవద్దు. పావురాలకు లేదా ఇతర పక్షులకు ఆహారం, నీరు పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంటికి, కుటుంబానికి మంచి జరుగుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


