బుధుడి నక్షత్రంలోకి గురుడు - రేపటి నుంచి 18 రోజుల పాటు 7 రాశులవారికి రాజయోగాలు..!
బుధుడు నక్షత్రంలో బృహస్పతి రశిఫాల్ గురు గోచర్ 2026: ఆశ్లేష నక్షత్రాన్ని బుధుడు యొక్క నక్షత్ర రాశిగా పరిగణిస్తారు. బృహస్పతి తన నక్షత్ర స్థానాన్ని మారుస్తున్నాడు. రేపటి నుండి బృహస్పతి కదలిక మారడం వల్ల, కొన్ని రాశిచక్రాల అదృష్టం ప్రకాశిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పుతో పాటు నక్షత్ర మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. నవగ్రహాల్లో శుభ గ్రహంగా, జ్ఞానం, సంతానం, సంపదలకు కారకుడిగా భావించే దేవగురు బృహస్పతి (గురుడు) ప్రస్తుత కాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. ఈ క్రమంలో బుధుడికి చెందిన ఆశ్లేష నక్షత్రంలోకి బృహస్పతి ప్రవేశిస్తున్నారు.

హిందూ పంచాంగం ప్రకారం….. ఆశ్లేష నక్షత్రం మూడో పాదంలో గురుడి నక్షత్ర సంచారం జరగనుంది. అనంతరం అక్టోబర్ 8న గురుడి నక్షత్ర పాదం మళ్లీ మారుతుంది. బుధుడి నక్షత్రమైన ఆశ్లేషలోకి గురుడు ప్రవేశించడంతో పాటు తన వేగాన్ని మార్చుకోవడం వల్ల మొత్తం 12 రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రఖ్యాత జ్యోతిష్య పండితులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం…… ఈ నక్షత్ర పరివర్తనం వల్ల రేపటి నుంచి రాబోయే 18 రోజుల పాటు ఏకంగా 7 రాశుల వారి అదృష్టం ప్రకాశించనుంది. అఖండమైన ధనలాభంతో పాటు వివిధ రంగాల్లో వీరికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.
మేష రాశి
ఈ రాశి వారికి ఆశ్లేష నక్షత్రంలో గురుడి సంచారం విశేష లాభాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే గణనీయంగా మెరుగవుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంది. వ్యాపారాలు చేసేవారికి లాభాలు పెరుగుతాయి. పెట్టుబడుల ద్వారా ఆశించిన దానికంటే ఎక్కువ రాబడి లభిస్తుంది.
మిథున రాశి
ఈ రాశి జాతకులకు గురుడి నక్షత్ర మార్పు అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. పూర్వీకుల ఆస్తులు లేదా గతంలో స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) రంగంలో చేసిన పాత పెట్టుబడులు ఇప్పుడు చేతికి అందివచ్చి ఆర్థికంగా మిమ్మల్ని ఎంతగానో బలోపేతం చేస్తాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
కర్కాటక రాశి
ప్రస్తుతం గురుడు కర్కాటక రాశిలోనే ఉన్నందున, బుధుడి నక్షత్రంలోకి ఆయన రాక ఈ రాశి వారికి అద్భుతంగా కలిసివస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది సువర్ణ సమయంగా మారుతుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. నిలిచిపోయిన పనులు వేగవంతం కావడమే కాకుండా ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఆశ్లేష నక్షత్రంలో గురుడి గమనం శుభ పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వ్యాపార నిమిత్తం శ్రమిస్తున్న వ్యక్తులు అనుకోని శుభవార్తలు వింటారు. నూతన ఆదాయ మార్గాలు సుగమమవుతాయి. ఉద్యోగులకు ఆఫీసు వాతావరణం సానుకూలంగా మారుతుంది.
తులా రాశి
తులా రాశి వారికి గురు గోచారం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న తల్లి గారి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఇంటికి కావలసిన విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి అధిపతి కుజుడైనప్పటికీ, గురుడి నక్షత్ర మార్పు వీరికి బాగా ఉపకరిస్తుంది. ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్లో పడిపోయిన పనులు, కోర్టు చిక్కులు లేదా ఆగిపోయిన వ్యవహారాలు మళ్లీ వేగం పుంజుకుంటాయి. అనుకున్న సమయానికి లక్ష్యాలను పూర్తిచేసి విజయం సాధిస్తారు.
మీన రాశి
మీన రాశి అధిపతి స్వయంగా గురువే కావడం వల్ల ఈ నక్షత్ర పరివర్తనం వీరికి పూర్తి స్థాయిలో కలసివస్తుంది. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న చట్టపరమైన లేదా కోర్టు వివాదాల్లో గెలుపు మీదే అవుతుంది. ఉద్యోగం, వ్యాపార రీత్యా దూరప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు భవిష్యత్తులో అత్యంత లాభదాయకంగా మారుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

