చాలా మందికి ఈ విషయం తెలియదు. కుమారస్వామి పార్వతీదేవి పుత్రుడా, లేదంటే గంగాదేవి పుత్రుడా అని.. ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా? కుమారస్వామి ఎవరి పుత్రుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కుమార స్వామి పార్వతీదేవి పుత్రుడా, గంగాదేవి పుత్రుడా?
పుత్రుడిగా జన్మించాలని కోరుకున్న శివుడు

బ్రహ్మ మానసపుత్రుడు అయిన సనత్కుమారుడు ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉండేవాడు. ఎల్లవేళలా ఆయన తపస్సులోనే నిమగ్నం అయ్యేవాడు. వైరాగ్యమూర్తి అయిన సనత్కుమారుడికి ఇంకో జన్మ ఉందని తెలిసిన పార్వతీ పరమేశ్వరులు తపోనిష్ఠగా గరిష్ఠుడైన సనత్కుమారుడిని పుత్రుడిగా పొందాలని అనుకున్నారు. అందుకు సంకల్పించి పరమేశ్వరుడు తపస్సు చేస్తున్న సనత్కుమారుడి దగ్గరకు వెళ్లి, “సనత్కుమారా! నువ్వు నాకు పుత్రుడిగా జన్మించాలని నేను కోరుకుంటున్నాను” అని అడగగా, సనత్కుమారుడు అలాగే అవుతుందని వరం ఇచ్చాడు.
సనత్కుమారుడికి చెప్పినా ఫలితం లేదు
ఇది తెలిసిన పార్వతీదేవి ఎంతో ఆశ్చర్యపోయింది. “పురుషుడైన నీవు నాకు పుత్రుడిగా జన్మించు అని ఎలా అడిగావు? అది అవ్వదు. కాబట్టి మాకు పుత్రుడిగా జన్మించమని అడుగు” అని పరమేశ్వరుణ్ని పంపింది. పరమేశ్వరుడు ఈ విషయాన్ని సనత్కుమారుడికి చెప్పాడు. కానీ ఫలితం లేకపోయింది.
నిప్పు ముద్దగా పరమేశ్వరుడు
కొంతకాలానికి సనత్కుమారుడు నిప్పుముద్దగా పరమేశ్వరుడులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఆ నిప్పుముద్ద భరించలేనంత వేడితో శివుని త్రినేత్రం నుంచి వేగంగా బయటకు వచ్చేసింది. శరవణ తటాకం, అనగా గంగలో పడింది. ఆ వేడిని భరించలేని గంగ ఆ నిప్పుముద్దను ఒడ్డుకు నెట్టేసింది. అది మెల్లగా ఒడ్డుకి కొంచెం పల్లంలో ఉన్న రెళ్ళు గడ్డిలోకి జారిపోయింది. అక్కడికి వచ్చిన ఆరుగురు కృత్తికా స్త్రీలు స్థనాలను (తల్లి పాలు) ఇవ్వబోగా, కుమారుడిగా మారిపోయింది.
ఇలా కుమార స్వామి పుట్టారు. సనత్కుమారుని వరం వలన పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడిగా జన్మించాడు. అలాగే కుమారస్వామి గంగలో నిప్పుముద్దగా ఉన్నాడు. కనుక గంగాపుత్రుడు అని కూడా అంటారు. అటు పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడిగా జన్మించాడు కాబట్టి పార్వతీ పుత్రుడు అని కూడా అంటారు.
కుమార స్వామి పేర్లు వెనుక కథ
{{/usCountry}}ఇలా కుమార స్వామి పుట్టారు. సనత్కుమారుని వరం వలన పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడిగా జన్మించాడు. అలాగే కుమారస్వామి గంగలో నిప్పుముద్దగా ఉన్నాడు. కనుక గంగాపుత్రుడు అని కూడా అంటారు. అటు పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడిగా జన్మించాడు కాబట్టి పార్వతీ పుత్రుడు అని కూడా అంటారు.
కుమార స్వామి పేర్లు వెనుక కథ
{{/usCountry}}మొదట కుమారస్వామి నిప్పుముద్ద రూపంలో ఉన్నందుకు అగ్నిపుత్రుడు అనే పేరు వచ్చింది.
అలాగే ప్రపంచంలో ఉన్న ఎలాంటి వస్తువునైనా దహించి, వాటిలో ఉన్న చెడును తొలగించే శక్తి అగ్నికి ఉన్నందుకు సుబ్రహ్మణ్యుడు అనే పేరు కూడా వచ్చింది.
ఆ నిప్పుముద్ద శరవణ తటాకంలో పడినందుకు శరవణభవుడు అనే పేరు వచ్చింది.
నిప్పుముద్ద గంగలో కొంచెం దూరం ప్రయాణం చేసినందుకు గంగాపుత్రుడు, గాంగేయుడు అని కూడా అంటారు.
నిప్పుముద్ద ఒడ్డు నుంచి పళ్లానికి జారి పడినందుకు స్కందుడు అనే పేరు వచ్చింది.
కృత్తికా స్త్రీలు పాలను ఇచ్చి పెంచినందుకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది.
నిప్పుముద్ద తేజోవంతుడైన కుమారునిగా మారినందుకు కుమారుడు అనే పేరు వచ్చింది. దేవత కళలు ఉట్టిపడుతుండడంతో కుమారస్వామి అనే పేర్లు వచ్చాయి. ఆరు ముఖాలతో వెలిగిపోవడంతో షణ్ముఖుడు అనే పేరు కూడా వచ్చింది.