Margasira Masam: మార్గశిర మాసంలో గురువారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి? తేదీ, పూజా విధానం, నైవేద్యాలతో పాటు పూర్తి వివరాలు!
నవంబర్ 21 అంటే ఈరోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమైంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలని అంటారు. మార్గశిర మాసానికి ఉన్న విశిష్టత కూడా ఇంత అంతా కాదు. మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపై సంచరిస్తుందని, ఆమెను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు.
ఈరోజు నుంచి మార్గశిర మాసం మొదలైంది. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి, లక్ష్మీ అనుగ్రహంతో డబ్బుకి కూడా లోటు ఉండదు. అయితే ఈసారి మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మి వారాలు వచ్చాయి, ఏ రోజు పెట్టిన నైవేద్యం పెట్టాలి, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలను తెలుసుకుందాం.

మార్గశిర మాసం 2025:
నవంబర్ 21 అంటే ఈరోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమైంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలని అంటారు. మార్గశిర మాసానికి ఉన్న విశిష్టత కూడా ఇంత అంతా కాదు. “మాసానం మార్గశీర్షోహం” అన్నారు. సాక్షాత్తు వరలక్ష్మి దేవిని మార్గశిర మాసంలో వచ్చే గురువారాల నాడు ఎవరైతే పూజిస్తారో వారికి వరాలను అందిస్తుంది, వారి కోరికలన్నీ తీరుతాయి. మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి, పూజా విధానం, నైవేద్యాలు, నియమాలు వంటి విషయాలను తెలుసుకుందాం.
లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వస్తుంది:
మార్గశిర మాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపై సంచరిస్తుందని, ఆమెను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు. శ్రావణ మాసంలో ఎలా అయితే అన్ని శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తామో, అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించాలని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి, కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం కలుగుతుంది. అందుకే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల నాడు లక్ష్మీదేవిని నియమాలతో ఆరాధించాలి. ఈ ఐదు గురువారాలు వినియోగించుకొని లక్ష్మీదేవిని పూజించాలి.
2025 మార్గశిర మాసంలో వచ్చిన గురువారాలు
ప్రతి ఏటా ఐదు గురువారాలు వస్తాయి. నాలుగు మార్గశిర మాసంలో, ఐదవది పుష్య మాసంలో. ఈ ఐదు రోజులు కూడా లక్ష్మీదేవిని నియమాలతో పూజించాలి.
మొదటి గురువారం – నవంబర్ 27
రెండవ గురువారం – డిసెంబర్ 4
మూడవ గురువారం – డిసెంబర్ 11
నాలుగవ గురువారం – డిసెంబర్ 18
ఐదవ గురువారం – పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం డిసెంబర్ 25
ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి?
మొదటి గురువారం: పులగాన్ని నైవేద్యంగా
రెండవ గురువారం: అట్లు, తిమ్మనం
మూడవ గురువారం: అప్పాలు, పరమాన్నం
నాలుగవ గురువారం: చిత్రాన్నం, గారెలు
ఐదవ గురువారం: పూర్ణం బూరెలను నైవేద్యంగా పెట్టాలి
మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి?
కార్తీక మాసంలో ఎలా అయితే శివుని ఆరాధిస్తామో, మార్గశిర మాసంలో ప్రతిరోజూ లక్ష్మీదేవిని ఆరాధించాలి. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు గురువారం నాడైనా తప్పకుండా లక్ష్మీదేవి ఎదుట దీపారాధన చేయాలి. తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచండి. తలస్నానం చేసేటప్పుడు షాంపూ పెట్టుకోకూడదు అని గమనించండి.
లక్ష్మీదేవిని ఆరాధించాలి
ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి. ఈ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. ఉదయం పూజ చేసే వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. పూజ పూర్తయిన తర్వాత మాత్రమే తినాలి. ముందుగా గణపతికి పూజ చేసి, ఆ తర్వాత లక్ష్మీదేవిని ఆరాధించాలి. కనకధార స్తోత్రం చదువుకుంటే మంచిది.
అలా చేయలేకపోతే “శ్రీ మహాలక్ష్మి దేవి నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. తులసమ్మను కూడా తప్పకుండా ఆరాధించి, తులసి ముందు దీపాన్ని వెలిగించండి. గురువారం పొరపాటున కూడా తలకు నూనె రాసుకోకూడదు. ప్రతి గురువారం కూడా గుమ్మాలకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి.
ముగ్గులో లక్ష్మీదేవి
ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ప్రతి గురువారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసి నమస్కరించుకోండి. కాళ్లకు నిండుగా పసుపు రాసుకుని, కుంకుమ బొట్టు పెట్టుకోండి. చేతులు నిండా మట్టి గాజులు ధరించాలి. ముత్తయిదుల్లా తయారై లక్ష్మీదేవిని ఆరాధించాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


