మౌని అమావాస్య 2026: మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది? తేదీ, శుభ సమయంతో పాటు ఏం చెయ్యాలో తెలుసుకోండి!

ప్రతి అమావాస్యనాడు చాలామంది రకరకాల పరిహారాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 18, ఆదివారం నాడు వచ్చింది. ఈ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం చూస్తే ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మౌని అంటే మౌనంగా ఉండడం అని అర్థం.

Published on: Jan 16, 2026, 10:00:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమావాస్య తిథికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి అమావాస్యనాడు చాలామంది రకరకాల పరిహారాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 18, ఆదివారం నాడు వచ్చింది. ఈ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం చూస్తే ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మౌని అంటే మౌనంగా ఉండడం అని అర్థం. అందుకే అమావాస్య నాడు చాలా మంది మౌన దీక్షను పాటిస్తారు. అలాగే ఈ మౌని అమావాస్య నాడు నదీ స్నానం చేయడం, దానధర్మాలు చేయడం వంటివి ఎంతో శుభప్రదమైన ఫలితాలను తీసుకువస్తాయి.

మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది? (pinterest)
మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది? (pinterest)

మౌని అమావాస్య 2026

ఈ మౌని అమావాస్య అనేది మహాశివరాత్రి పండుగకు ముందు వస్తుంది. దీంతో సాధువులు, యోగ సాధకులు మౌని అమావాస్యను చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమమైన త్రివేణి సంగమంలో స్నానం చేస్తారు.

మౌని అమావాస్య తేదీ, శుభ ముహూర్తం

మౌని అమావాస్య జనవరి 18, ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజు అనగా జనవరి 18 తెల్లవారుజామున 12:03కి అమావాస్య తిథి మొదలవుతుంది. తర్వాత రోజు అంటే జనవరి 19, 01:21తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి. కనుక మౌని అమావాస్యను జనవరి 18న జరుపుకోవాలి.

ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఉదయం 5:27 నుంచి ఉదయం 6:21 మధ్య స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అమావాస్య నాడు చంద్రుడు దర్శనం ఇవ్వడు. మౌని అమావాస్య నాడు కూడా చంద్రుడు దర్శనం ఉండదు కనుక ఆ అమావాస్య నాడు కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉండవు. మౌని అమావాస్యనాడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

మౌని అమావాస్య నాడు వీటిని పాటించడం మంచిది

అమావాస్య నాడు రుద్రాక్ష మాలను ధరిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.

నువ్వుల నూనెతో లేదా నువ్వులతో శనీశ్వరుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.

మౌని అమావాస్య నాడు పూర్తిగా మౌనం పాటించడం మంచిదని అంటారు. అందుకే మౌని అమావాస్య నాడు అందరూ మౌనంగా ఉంటారు. అలా చేయడం వలన అంతఃశుద్ధీకరణ జరుగుతుంది.

అలాగే గంగా నదిలో లేదా త్రివేణి సంగమంలో ఆ రోజు నీరు అమృతంతో సమానం అని అంటారు. అందుకని ఆ రోజున పుణ్యస్నానం చేస్తారు.

నాగసాధువులులో చేరే వారికి కూడా అది పవిత్రమైన రోజు అని నమ్ముతారు.

రావి చెట్టు నీడలో మౌని అమావాస్య నాడు దీపాలను వెలిగిస్తే చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు.

పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టడం కూడా శుభ ఫలితాలను తీసుకువస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More