...
...
Next Story

గణేష్ చతుర్థి నాడు మీ రాశి ప్రకారం వినాయకుడికి వీటిని సమర్పిస్తే సకల శుభాలు

Ganesh Chaturthi 2026 : ఈ సంవత్సరం గణేష్ చతుర్థి సెప్టెంబర్ 14. ఈ ప్రత్యేకమైన రోజున మీ రాశిచక్రం ప్రకారం గణేశుడికి కొన్నింటిని సమర్పించడం చాలా శుభప్రదమని అంటారు.

Published on: Sep 13, 2026, 17:55:15 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గణేష్ చతుర్థికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి నాడు వినాయక చవితిని అత్యంత ఉత్సాహంగా జరుపుకొంటారు. ఈ ప్రత్యేకమైన రోజున గణేశుడికి కొన్ని వస్తువులను సమర్పించడం ద్వారా మీరు ప్రత్యేక ఆశీస్సులను పొందవచ్చు. మీ రాశిచక్రం ప్రకారం ఈ రోజున గణేశుడికి కొన్ని వస్తువులను సమర్పించడం చాలా మంచిదని అంటారు. మీ రాశి ప్రకారం.. గణేశుడికి ఏం సమర్పించాలో తెలుసుకోండి.

వినాయక చవితి 2026
వినాయక చవితి 2026

మేష రాశి : గణేష్ చతుర్థి నాడు గణేశుడికి బెల్లంతో చేసిన మిఠాయిని నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. ఈ మిఠాయిని సమర్పించడం వల్ల ఆనందం కలుగుతుందని, జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుందని అంటారు .

వృషభ రాశి : ఈ పవిత్రమైన రోజున గణేశుడికి పాలతో చేసిన మిఠాయిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యం ద్వారా వృషభ రాశి వారు ఆనందం, శాంతి, సంతోషకరమైన మనస్సును పొందుతారు.

మిథున రాశి : ఈ రాశిలో జన్మించిన వారు గణేష్ చతుర్థి పవిత్రమైన సందర్భంలో గణేశుడికి దూద్ పేడ సమర్పించడం చాలా శుభప్రదమని అంటారు. దీని కారణంగా మిథున రాశిలో జన్మించిన వారు జీవితంలో విజయం సాధిస్తారు. కొత్త అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కర్కాటక రాశి : ఈ పవిత్రమైన సందర్భంలో కర్కాటక రాశి వారు గణేశుడికి పాయసం సమర్పించడం చాలా మంచిది. ఈ తీపి వంటకాన్ని సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత లభించే అవకాశాలు పెరుగుతాయి.

సింహ రాశి : ఈ రాశి వారు ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి లడ్డును సమర్పించాలి. ఈ తీపి పదార్థాన్ని సమర్పించడం వల్ల సింహ రాశి వారి జీవితంలో గౌరవం, కీర్తి బాగా పెరుగుతాయి .

తులా రాశి : ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పవిత్రమైన సందర్భంగా తులారాశి వారు గణేశుడికి మోదకం సమర్పించాలి. గణేశుడికి ఈ తీపి పదార్థాన్ని సమర్పించడం వల్ల మీ జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి.

వృశ్చిక రాశి : ఈ సంవత్సరం గణేశ చతుర్థి నాడు వృశ్చిక రాశి వారికి విఘ్న స్వామికి దూద్ పేడ సమర్పించడం చాలా శుభప్రదం. ఈ తీపి పదార్థాన్ని సమర్పించడం ద్వారా వృశ్చిక రాశి వారు తమ జీవితంలో సానుకూల అభివృద్ధిని పొందుతారు.

ధనుస్సు రాశి : గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ధనుస్సు రాశి వారు గణేశుడికి కుంకుమపువ్వుతో కలిపి చేసిన బూందీ లడ్డూను నైవేద్యంగా సమర్పించాలి. ఈ తీపిని నైవేద్యంగా సమర్పించడం వల్ల అన్ని రంగాలలోనూ శుభ ఫలితాలు కలుగుతాయి.

మకర రాశి : మకర రాశి వారు గణేష్ చతుర్థి పవిత్రమైన సందర్భంగా విఘ్నేషుడికి లడ్డును సమర్పించాలి. ఈ తీపి పదార్థాన్ని సమర్పించడం వల్ల వారి జీవితంలో ప్రతీదీ శుభప్రదంగా ఉంటుంది.

కుంభ రాశి : ఈ సంవత్సరం గణేష్ చతుర్థి నాడు కుంభ రాశి వారు గణేశుడికి హల్వా సమర్పించడం చాలా శుభప్రదం. ఈ నైవేద్యాన్ని సమర్పించడం వల్ల కుంభ రాశి వారి జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయి.

మీన రాశి : గణేష్ చతుర్థి పండుగ రోజున మీన రాశి వారు గణేశుడికి పాయసం సమర్పించడం చాలా శుభప్రదమని అంటారు. ఈ తీపి వంటకాన్ని సమర్పించడం వల్ల మీన రాశి వారి మనసులకు శాంతి చేకూరుతుంది. వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెచ్చిపెట్టే అద్భుతమైన యోగం ఏర్పడుతుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks