ఏకాదశి తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఏట 24 ఏకాదశులు వస్తాయి. అధికమాసం వచ్చింది కనుక మరో రెండు ఏకాదశులు వస్తాయి. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులు ఒకే ఎత్తు అయితే, అధికమాసంలో వచ్చే పద్మిని ఏకాదశి మరో ఎత్తు అని చెప్పొచ్చు. దీనిని కమల ఏకాదశి అని కూడా అంటారు. మూడేళ్లకి ఒకసారి వచ్చే ఈ అరుదైన అతిథి భక్తులకు ఎంతో మంచి చేస్తుంది. శుభ ఫలితాలను అందిస్తుంది.
పద్మిని ఏకాదశి 2026

అధిక మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి నాడు విష్ణువుని, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన సుఖసంతోషాలను పొందవచ్చు. మీకున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏకాదశి నాడు భక్తితో విష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు కూడా చెబుతున్నాయి.
పద్మిని ఏకాదశి 2026 తేదీ, సమయం, ముహూర్తంతో పాటు ఏకాదశి ప్రత్యేకత, పూజా విధానం, దానధర్మాల గురించి కూడా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పద్మిని ఏకాదశి 2026 ముహూర్తం
ఈ ఏడాది పద్మిని ఏకాదశి మే 26 తెల్లవారుజామున 5:10కి మొదలవుతుంది. మే 27 ఉదయం 6:21తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి, మే 27 అంటే రేపు ఏకాదశిని జరుపుకోవాలి. తర్వాత రోజు అనగా మే 28న ఉపవాసాన్ని విరమించాలి. సరైన పద్ధతిలో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన పూర్తి ఫలితం దక్కుతుంది.
ఏకాదశి ప్రత్యేకత
పద్మిని ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు అని చెప్పొచ్చు. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ వ్రతం వరం కంటే తక్కువేమీ కాదు. పద్మిని ఏకాదశి వ్రతం చేయడం వలన తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ అధికమాసంలో చేసే జపం, తపం, దానం, వ్రతాలకు మామూలు రోజుల కంటే ఎక్కువ రెట్లు ఫలితం ఉంటుంది. ఏకాదశి రోజున విష్ణు కథలు విన్నా, చదివినా కూడా ఇంట్లో సుఖ శాంతులు కలుగుతాయి.
దానధర్మాల ప్రాముఖ్యత
ఈ ఏకాదశి నాడు దానాలు చేయడం వలన విశేషమైన ఫలితాలను చూడొచ్చు. గోధుమపిండి, పప్పులు, వస్త్రాలు, పండ్లు వంటి వాటిని దానం చేయడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
పూజ ఎలా చేసుకోవాలి?
{{/usCountry}}ఈ ఏకాదశి నాడు దానాలు చేయడం వలన విశేషమైన ఫలితాలను చూడొచ్చు. గోధుమపిండి, పప్పులు, వస్త్రాలు, పండ్లు వంటి వాటిని దానం చేయడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
పూజ ఎలా చేసుకోవాలి?
{{/usCountry}}ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి.
పూజగదిని కూడా శుభ్రంగా ఉంచి, ఒక పీటపై పసుపు వస్త్రాన్ని వేయండి. దానిపై విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలను పెట్టండి.
గంగాజలంతో అభిషేకం చేసి, అక్షింతలు, పసుపు రంగు పండ్లు, ఎర్రటి పువ్వులను విష్ణుకి, లక్ష్మీదేవికి సమర్పించండి.
ఈరోజు “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించండి.
ధూప, దీప, నైవేద్యాలతో విష్ణువుని, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి, చివరిగా క్షమాపణ చేసుకోండి.
ఈ విధంగా పద్మిని ఏకాదశి పూజ చేయడం వలన కోరిన కోర్కెలు తీరుతాయి. ఇంట్లో ఉన్న ఇబ్బందులు అన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది.