...
...
Next Story

డిసెంబర్ వరకు శని తిరోగమనం - ఈ 5 రాశులవారికి కలిసిరానున్న అదృష్టం! వీరికి పెరగనున్న బాధ్యతలు

శనిదేవుడు ప్రస్తుతం తిరోగమనంలో ఉన్నాడు. డిసెంబర్ 11 వరకు కొనసాగే ఈ 90 రోజుల కాలం వివిధ రాశుల వారి కెరీర్, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపనుంది.

Published on: Sep 12, 2026, 12:13:25 IST
Advertisement

జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఆయనను న్యాయం, కర్మ, క్రమశిక్షణలకు అధిపతిగా భావిస్తారు. శని దేవుడు తన రాశిని మార్చినా లేదా తన సంచార వేగంలో మార్పులు చేసుకున్నా…. ఆ ప్రభావం ద్వాదశ రాశుల జీవితాలపై విభిన్న రూపాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శని గ్రహం తిరోగమన స్థితిలో (వెనుకకు పయనించడం) సంచరిస్తోంది. రాశిచక్రంలోని పలు రాశుల వారికి ఈ గ్రహ స్థితి అత్యంత కీలకమైనదిగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

డిసెంబర్ 11 వరకు శని తిరోగమనం
డిసెంబర్ 11 వరకు శని తిరోగమనం

శని తిరోగమన సంచారం రాబోయే డిసెంబర్ 11 వరకు కొనసాగనుంది. అంటే శని దేవుడి ప్రభావం ఈ రూపంలో మరో 90 రోజుల పాటు స్పష్టంగా ఉండబోతోంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం.. శని తిరోగమనంలో ఉన్న సమయంలో గతంలో నిలిచిపోయిన పనులు, అసంపూర్తిగా వదిలేసిన అంశాలు మళ్లీ ముందరకు వస్తాయి. చాలా కాలంగా ఆలస్యమవుతూ వస్తున్న పనుల్లో క్రమంగా కదలిక వచ్చి వేగం పుంజుకునే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో, కొందరు వ్యక్తులు తమ పాత నిర్ణయాలను, పని చేసే శైలిని పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ 90 రోజుల కాలంలో ప్రధానంగా 5 రాశుల వారిపై పడే ప్రభావం ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి:

రాశి జాతకులకు రాబోయే సమయం తీవ్రమైన శ్రమతో కూడుకున్నది, అలాగే అంతే ముఖ్యమైనది. గతంలో మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన పాత పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూల సంకేతాలు అందుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ పాత పరిచయాల ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు.

వృషభ రాశి :

మిథున రాశి వారికి ఈ కాలం కెరీర్‌లో గణనీయమైన మార్పులను సూచిస్తోంది. ఆఫీసులో లేదా వర్క్‌ప్లేస్‌లో మీరు గతంలో పడ్డ కష్టానికి ఫలితం దక్కడానికి కాస్త సమయం పట్టవచ్చు, కానీ మీ శ్రమ మాత్రం ఏమాత్రం వృథా పోదు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారవేత్తలకు నూతన పరిచయాలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయి.

కుంభ రాశి :

శని తిరోగమన గమనం కుంభ రాశి వారికి అత్యంత ప్రత్యేకమైనదిగా మారబోతోంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగయ్యే సంకేతాలు ఉన్నాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులు తమ పనితీరుతో యాజమాన్యాన్ని మెప్పించే అవకాశాలు లభిస్తాయి. అయితే, ధనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు సరికాదు.

మీన రాశి :

మీన రాశిలోనే శని సంచరిస్తుండటంతో ఈ రాశి వారికి రాబోయే 90 రోజులు చాలా కీలకమైనవి. పనుల్లో కొంత ఆలస్యం జరగడం లేదా అదనపు బాధ్యతల భారం వల్ల మానసిక ఆందోళన కలగవచ్చు. కానీ సహనంతో వ్యవహరిస్తే ఎలాంటి పరిస్థితులనైనా చక్కదిద్దవచ్చు. పాత నిర్ణయాలను సమీక్షించుకోవడం, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.

మొత్తానికి…. శని తిరోగమన సమయంలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను నేరుగా ఎదుర్కొని నెరవేర్చాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కాబట్టి కేవలం లాభాల పైనే ఆశలు పెట్టుకోకుండా, చేసే పనిపై, తీసుకునే నిర్ణయాలపై పూర్తి దృష్టి సారించడం చాలా అవసరం. డిసెంబర్ 11 వరకు ఉన్న ఈ 90 రోజుల వ్యవధిని కెరీర్, ఆర్థిక ప్రణాళికల పునఃపరిశీలనకు ఒక మంచి అవకాశంగా మలుచుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks