శారదీయ నవరాత్రులు 2026: అక్టోబర్ 11 నుంచి అమ్మవారి నవరాత్రులు.. కలశ స్థాపన ముహూర్తాలు ఇవే

శారదీయ నవరాత్రి వేడుకలు అక్టోబర్ 11న ఘటస్థాపనతో ప్రారంభం కానున్నాయి. ఆశ్వయుజ శుక్ల ప్రతిపద అక్టోబర్ 10 రాత్రి ప్రారంభమై, అక్టోబర్ 11 రాత్రి వరకు కొనసాగనుంది. అక్టోబర్ 11న ఉదయం 6:19 నుంచి 10:12 వరకు కలశ స్థాపనకు శుభ ముహూర్తం ఉండగా, అభిజిత్ ముహూర్తంలో  కలశ ప్రతిష్ఠ చేయవచ్చు.

Published on: Aug 21, 2026, 14:00:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది శారదీయ నవరాత్రి అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానుంది. తిథుల తారుమారు కారణంగా దుర్గాష్టమి, మహానవమి ఒకే రోజు రాగా, విజయదశమితో వేడుకలు ముగియనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

శారదీయ నవరాత్రులు 2026: అక్టోబర్ 11 నుంచి అమ్మవారి నవరాత్రులు.. కలశ స్థాపన ముహూర్తాలు ఇవే
శారదీయ నవరాత్రులు 2026: అక్టోబర్ 11 నుంచి అమ్మవారి నవరాత్రులు.. కలశ స్థాపన ముహూర్తాలు ఇవే

హిందూ సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే శారదీయ నవరాత్రి వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. అశేష భక్తజనం ఎంతగానో ఎదురుచూసే ఈ పవిత్ర పర్వదినం ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది విభిన్న స్వరూపాలను భక్తులు పూజిస్తారు. మొదటి రోజు గృహాలు, ఆలయాలలో ఘనంగా కలశ స్థాపన (ఘటస్థాపన) నిర్వహిస్తారు. ఆ తర్వాత వరుసగా తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు, పూజలు, ప్రత్యేక అర్చనలు కొనసాగుతాయి.

తేదీలు వివరాలు

పంచాంగం ప్రకారం, ఆశ్వయుజ శుక్ల ప్రతిపద అక్టోబర్ 11, 2026న వస్తోంది. సరిగ్గా ఇదే రోజున ఘటస్థాపనతో శారదీయ నవరాత్రులు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ప్రతిపద తిథి అక్టోబర్ 10 రాత్రి 9:19 గంటలకు మొదలై, అక్టోబర్ 11 రాత్రి 9:30 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రామాణికత ఆధారంగా అక్టోబర్ 11వ తేదీనే నవరాత్రుల మొదటి రోజుగా పరిగణిస్తారు.

కలశ స్థాపన శుభ ముహూర్తాలు

ఖగోళ, పంచాంగ లెక్కల ప్రకారం అక్టోబర్ 11న ఘటస్థాపన చేయడానికి అద్భుతమైన ముహూర్తం లభిస్తోంది.

ఉదయం 6:19 నిమిషాల నుంచి ఉదయం 10:12 నిమిషాల వరకు కలశ స్థాపన చేసుకోవచ్చు. ఈ ముహూర్త వ్యవధి దాదాపు 3 గంటల 52 నిమిషాలు ఉంటుంది. ఒకవేళ ఉదయం ఈ సమయంలో పూజా కార్యక్రమాలు కుదరని వారు, అభిజిత్ ముహూర్తంలో అంటే ఉదయం 11:44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:31 నిమిషాల మధ్యలో కూడా కలశాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు.

నవరాత్రుల్లో తొమ్మిది రోజులు.. అమ్మవారి పూజా క్రమం

అక్టోబర్ 11: శైలపుత్రి దేవి

అక్టోబర్ 12: బ్రహ్మచారిణి దేవి

అక్టోబర్ 13: చంద్రఘంట దేవి

అక్టోబర్ 14: కూష్మాండ దేవి

అక్టోబర్ 15: స్కందమాత దేవి

అక్టోబర్ 16: కాత్యాయనీ దేవి

అక్టోబర్ 17: కాలరాత్రి దేవి

అక్టోబర్ 18: మహాగౌరి దేవి

అక్టోబర్ 19: సిద్ధిదాత్రి దేవి మరియు మహానవమి పూజా కార్యక్రమాలు

దుర్గాష్టమి, మహానవమి ఒకే రోజు

ఈ ఏడాది తిథుల గందరగోళం వల్ల అక్టోబర్ 19, సోమవారం రోజునే దుర్గాష్టమి అలాగే మహానవమి పర్వదినాలు ఒకే రోజు రావడం విశేషం. దీని వల్ల భక్తులు అష్టమి, నవమికి సంబంధించిన ప్రధాన పూజలను ఒకే రోజు చేయాల్సి ఉంటుంది.

అదే రోజున అత్యంత ప్రాధాన్యత కలిగిన సంధి పూజ నిర్వహించనున్నారు. సంధి పూజ సమయం ఉదయం 10:27 నుంచి 11:15 గంటల వరకు ఉంటుందని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఈ సమయంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

విజయదశమి మరియు ప్రతిమల నిమజ్జనం

తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే నవరాత్రి వేడుకల ముగింపునకు అక్టోబర్ 20, 2026, మంగళవారం రోజున విజయదశమి (దసరా) పండుగ వస్తుంది. ఇదే రోజున అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కూడా పలు ప్రాంతాల్లో నిర్వహిస్తారు.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More