...
...
Next Story

ఆగస్టు 12న సూర్య గ్రహణం.. నాలుగు రాశులపై ప్రభావం, ఈ పరిహారాలను పాటిస్తే మంచిది!

ఆగస్టు 12, 2026న ఏడాదిలో రెండో సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది భారతదేశంలో కనిపించకపోవడంతో సూతక కాలం వర్తించదు. అయినప్పటికీ, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ గ్రహణ ప్రభావం సింహం, కుంభం, మేషం, మకర రాశుల వారిపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Published on: Aug 3, 2026, 09:36:06 IST
Advertisement

ఖగోళంలో అద్భుతాలు జరగడం సహజం. ఈ కోవలోనే ఏడాదిలోని రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12న వైజ్ఞానిక లోకాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. ఈ కారణంగానే భారతదేశంలో దీనికి సంబంధించిన సూతక కాలం వర్తించదని పండితులు స్పష్టం చేస్తున్నారు. నేరుగా కంటికి కనిపించనంత మాత్రాన గ్రహాల కదలికలలో వచ్చే మార్పులు మానవ జీవితాలపై, రాశులపై ప్రభావం చూపకుండా ఉండవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఆగస్టు 12 సూర్య గ్రహణం.. ఈ నాలుగు రాశులపై ప్రభావం, ఈ పరిహారాలను పాటిస్తే మంచిది!
ఆగస్టు 12 సూర్య గ్రహణం.. ఈ నాలుగు రాశులపై ప్రభావం, ఈ పరిహారాలను పాటిస్తే మంచిది!

ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం, ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు రాబోయే కాలంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సింహం, కుంభ రాశులతో పాటు మేష, మకర రాశుల వారు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ రాశులకు చిన్నపాటి ఇబ్బందులు

సింహ రాశి:

రాశి వారు ఏ విషయంలోనైనా అతిగా కోపగించుకోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి. ఉద్యోగంలో పదవులు మారడం లేదా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వ్యాపారంలో ఎలాంటి రిస్క్ తీసుకునే ముందైనా పూర్తి సమాచారం సేకరించండి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విషయాలకు వాదనలకు దిగకండి. ఆరోగ్యం పట్ల ఏమాత్రం అలసక్ష్యం వద్దు.

కుంభ రాశి:

ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు కుంభ రాశి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టకండి. కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించాలనుకుంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. ప్రయాణాలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించండి. కుటుంబంతో ప్రశాంతంగా గడుపుతూ మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి.

మేష, మకర రాశుల జాతకులు ఏం చేయాలి?

మేష రాశి:

మకర రాశి జాతకులు తమ ఆరోగ్యం, వృత్తి ఈ రెండింటిపై సమానమైన శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో హడావుడి పడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నష్టపోవాల్సి వస్తుంది. ఆర్థిక పరమైన పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి. కుటుంబంలో అందరితో సఖ్యతగా ఉంటూ చిన్నచిన్న విషయాలను మనసునకు హత్తుకోకండి.

గ్రహణ సమయంలో ఏం చేయాలి?

సూర్యగ్రహణం రోజున సాధ్యమైనంత వరకు భగవంతుని స్మరణలో గడపడం శ్రేయస్కరం. శ్రీసూర్య భగవానుడి నామాలను లేదా మహా మత్యుంజయ మంత్రాన్ని మనసారా జపించండి. పేదలకు, ఆకలితో ఉన్నవారికి దానధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. గ్రహణ వేళ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని, ఎవరితోనూ అనవసర వాదనలకు దిగకూడదని పెద్దలు సూచిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe