రోహిణి నక్షత్రంలోకి సూర్యుడి సంచారం - జూన్ 8 వరకు ఈ రాశుల వారికి ఊహించని లాభాలు..!
గ్రహాల రాజు సూర్యుడు చంద్రుడి నక్షత్రమైన రోహిణిలోకి ప్రవేశించాడు. జూన్ 8, 2026 వరకు సూర్యుడి ఈ గోచారం వల్ల మేషం, సింహం, వృషభం, ధనుస్సు రాశుల వారికి లాభాలు కలగనున్నాయి.
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాజుగా పిలిచే సూర్య భగవానుడి కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సూర్యుడు రాశి మారినా…. నక్షత్రం మారినా ఆ ప్రభావం మొత్తం 12 రాశిచక్రాలపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సూర్యుడు తన నక్షత్ర సంచారంలో భాగంగా రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం, సూర్యుడు జూన్ 8, 2026 మధ్యాహ్నం 01:38 గంటల వరకు ఇదే రోహిణి నక్షత్రంలో కొలువై ఉంటాడు.

రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. సూర్యుడు, చంద్రులు పరస్పరం మిత్ర గ్రహాలు కావడంతో, చంద్రుడి నక్షత్రంలో సూర్యుడి ఈ సంచారం కొన్ని రాశుల వారికి అమితమైన అదృష్టాన్ని మోసుకురానుంది. ముఖ్యంగా జూన్ 8వ తేదీ వరకు 4 రాశుల వారి జాతకం బంగారంలా ప్రకాశించబోతోంది. ఆ అదృష్ట రాశుల వివరాలు, వారికి కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి…..
మేష రాశి : చంద్రుని నక్షత్రంలో సూర్యుని సంచారం మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అద్భుతమైన విజయాలను అందిస్తుంది.
- కెరీర్: ఉద్యోగస్తులు తమ రంగాల్లో పదోన్నతి (ప్రమోషన్) పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు పడే కష్టానికి తగ్గ గుర్తింపు, పైఅధికారుల ప్రశంసలు దక్కుతాయి.
- సమాజంలో గుర్తింపు: మీ పేరు… మీరు చేసే పనులు సమాజంలో ప్రత్యేక ముద్ర వేస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
- వ్యక్తిగత జీవితం: ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. కుటుంబం లేదా భాగస్వామి నుండి ఆకస్మికంగా కొన్ని శుభవార్తలు వింటారు.
సింహ రాశి : ఈ రాశికి అధిపతి. కాబట్టి ఈ నక్షత్ర సంచారం మీకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది.
- ఆటంకాలు తొలగుతాయి: సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు లేదా కోర్టు వ్యవహారాలు మళ్లీ వేగవంతమై మీకు అనుకూలంగా మారుతాయి.
- వ్యాపారం: వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త పెట్టుబడులకు ఇది అనుకూల సమయం.
- సంతాన సుఖం: పిల్లల చదువు లేదా ఉద్యోగానికి సంబంధించి తల్లిదండ్రులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ధనుస్సు రాశి : ఈ రాశి వారికి ఈ సూర్య గోచారం ఆర్థికంగా విపరీతమైన బలాన్ని చేకూరుస్తుంది.
- ఆర్థిక పరిస్థితి: మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సంపదను పెంచుకునే మార్గాలు సుగమం అవుతాయి.
- ఆత్మవిశ్వాసం: ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కఠినమైన నిర్ణయాలను కూడా ధైర్యంగా తీసుకోగలుగుతారు.
- మానసిక ప్రశాంతత: ఇటు వృత్తిలోనూ, అటు కుటుంబంలోనూ అనుకూల వాతావరణం ఉండటం వల్ల మనస్సుకు ఎంతో సంతోషం, ప్రశాంతత లభిస్తాయి.
వృషభ రాశి : సూర్యుడి ఈ నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి అయాచిత లబ్ధిని చేకూరుస్తుంది.
- విదేశీ యోగం : వ్యాపార రంగంలో ఉన్నవారికి విదేశీ కంపెనీల నుండి పెద్ద ఒప్పందాలు (డీల్స్) దక్కే అవకాశం ఉంది. ఉద్యోగులకు విదేశీ ప్రయాణాలు కలిసివస్తాయి.
- కుటుంబ సాయం : తండ్రి లేదా పితృ సమానులైన వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వారి సలహాలు మీ పురోగతికి తోడ్పడతాయి.
- ఆధ్యాత్మికత : ఈ కాలంలో మీకు మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇంటా బయటా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

