హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే 'దేవశయని ఏకాదశి'కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది జూలై 25, 2026 శనివారం రోజున ఈ పవిత్ర వ్రతం వచ్చింది. ఈ ఏకాదశితోనే చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు క్షీరాసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే ఈ సమయం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనువైనదిగా భావిస్తారు.

ఈ వ్రత ప్రాముఖ్యత గురించి ఒకసారి ధర్మరాజు యుధిష్టరుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నించగా, బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించిన దివ్య కథను శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. సమస్త పాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదించే ఈ ఏకాదశి వెనుక ఉన్న పురాణగాథ ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం.
మాంధాత చక్రవర్తి
పురాతన కాలంలో మాంధాత అనే చక్రవర్తి భూలోకాన్ని పరిపాలించారు. ఆయన సత్యసంధుడు, ధర్మపరాణుడు, మహా ప్రతాపశాలి. తన ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పాలన సాగింది. ఆయన రాజ్యంలో ప్రజలు ఎలాంటి ఆకలిదప్పులు లేకుండా సుభిక్షంగా ఉండేవారు. వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల ఆ రాజ్యంలో ఎప్పుడూ అరుదైన సిరులు విరాజిల్లాయి.
అయితే, ఒకసారి విధి విలాసంలాంటి విపత్తు ఆ ప్రభువును చుట్టుముట్టింది. వరుసగా మూడేళ్ల పాటు ఆ రాజ్యంలో ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. దీని వల్ల రాష్టమ్రంతా భయంకరమైన అకాలం తాండవించింది. అన్నపానీయాలు కరవయ్యి ప్రజలు విలవిలలాడిపోయారు. నీరు లేక యజ్ఞ యాగాదులు, పూజా కార్యక్రమాలు నిలిచిపోయాయి.
ప్రజల ఆవేదన..
కరువు కోరల్లో చిక్కుకున్న ప్రజలు ఒక్కసారిగా రాజు వద్దకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. "రాజా! సృష్టికి మూలం వర్షం. వానలు పడక మేమంతా ఆకలితో అల్లాడిపోతున్నాము. ఈ విపత్తు నుంచి మమ్మల్ని రక్షించే ఏదైనా మార్గాన్ని చూపండి" అని వేడుకున్నారు.
ప్రజల దీనస్థితిని చూసి చలించిపోయిన రాజు మాంధాత తీవ్రంగా ఆలోచించారు. తాను ఎప్పుడూ అధర్మం చేయలేదని, మరి తన రాజ్యంలో ఈ కష్టం ఎందుకు వచ్చిందో అర్థం కాక సతమతమయ్యారు. ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతూ ఆయన తన సైన్యంతో అడవికి బయలుదేరారు.
మహర్షి అంగీరసుని ఆశ్రమానికి రాక
{{/usCountry}}ప్రజల దీనస్థితిని చూసి చలించిపోయిన రాజు మాంధాత తీవ్రంగా ఆలోచించారు. తాను ఎప్పుడూ అధర్మం చేయలేదని, మరి తన రాజ్యంలో ఈ కష్టం ఎందుకు వచ్చిందో అర్థం కాక సతమతమయ్యారు. ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతూ ఆయన తన సైన్యంతో అడవికి బయలుదేరారు.
మహర్షి అంగీరసుని ఆశ్రమానికి రాక
{{/usCountry}}దట్టమైన అడవుల్లో ప్రయాణిస్తూ రాజు మాంధాత బ్రహ్మదేవుని కుమారుడైన మహర్షి అంగీరసుని ఆశ్రమానికి చేరుకున్నారు. గుర్రం దిగి మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. రాజా ఆగమనానికి కారణం ఏమిటని మహర్షి ఆరా తీయగా, మాంధాత తన గోడును వెళ్లబోసుకున్నారు.
"మహర్షీ! నేను ధర్మబద్ధంగానే రాజ్యాన్ని పాలిస్తున్నాను. అయినప్పటికీ నా రాజ్యంలో మూడేళ్లుగా వర్షాలు పడక కరువు తాండవిస్తోంది. రాజ పాపాల వల్లే ప్రజలు కష్టాలు పడతారంటారు. మరి నా రాజ్యంలో ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో నాకు మార్గదర్శనం చేయండి" అని వినయంగా కోరారు.
అకాలం నుంచి విముక్తికి మార్గం
రాజు దీనగాథను ఆలకించిన మహర్షి అంగీరసుడు దివ్య దృష్టితో పరిశీలించి ఒక పరిష్కారం చెప్పారు. "రాజా! ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశినే దేవశయని (హరిశయని) ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను పోగొట్టి, సకల సిద్ధులను ప్రసాదిస్తుంది. మీ మంత్రులు, ప్రజలతో కలిసి మీరు ఈ ఏకాదశి వ్రతాన్ని విధివిధానంగా ఆచరించండి. శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో మీ రాజ్యంలో కుండపోత వర్షాలు కురుస్తాయి" అని భరోసానిచ్చారు.
వెల్లువెత్తిన వానలు.. కళకళలాడిన రాజ్యం
మహర్షి అంగీరసుడు చెప్పిన విధానం తెలుసుకున్న రాజు మాంధాత వెంటనే రాజధానికి తిరిగి వచ్చారు. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున తన మంత్రులు, ప్రజలతో కలిసి అత్యంత భక్తిశ్రద్ధలతో దేవశయని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, శ్రీహరిని పూజించారు.
ఆ దైవిక పూజా ప్రభావం తక్షణమే కనిపించింది. వ్రతం పూర్తయిన వెంటనే ఆ రాజ్యంలో ఆకాశం మేఘావృతమై ముసలాధార వర్షం కురిసింది. ఆ వానతో నేల తడిసి, ప్రతి ఇంటా పచ్చదనం వెల్లివిరిసింది. నీటి ఎద్దడి తీరిపోయి, పంటలు బాగా పండటంతో మాంధాత రాజ్యం మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంది.