హిందూ సంప్రదాయంలో పవిత్రమైన శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారమూ పార్వతీదేవిని భక్తిశ్రద్ధలతో కొలిచే 'మంగళ గౌరీ వ్రతం' అత్యంత విశిష్టమైనది. నేడు (ఆగస్టు 18) శ్రావణ మాస శుక్ల పక్ష షష్ఠి తిథి సందర్భంగా మొదటి మంగళ గౌరీ వ్రతం వచ్చింది. నవ వధువులు ఈ వ్రతాన్ని ఆచరించడం వెనుక ఉన్న పౌరాణిక ప్రాముఖ్యత, పూజా విధానం మరియు నియమాల గురించి తెలుసుకుందాం.
వైవాహిక జీవితానికి శ్రీమహాలక్ష్మి వంటి వ్రతం

మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా జగన్మాత పార్వతీదేవి సంతోషిస్తుందని, భక్తులకు సుఖసంతోభరితమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం ఉంది. ముఖ్యంగా కొత్తగా వివాహమైన యువతులు ఈ శ్రావణ మాసంలో మొదటిసారిగా మంగళ గౌరీ వ్రతం చేస్తుంటే, కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం తప్పనిసరి. ఈ పవిత్ర రోజున వ్రత కథను పఠించడం లేదా వినడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మంగళ గౌరీ వ్రత పౌరాణిక కథ
పురాణ కాలంలో ధర్మపాలుడనే శ్రేష్ఠుడు ఒక నగరంలో నివసించేవాడు. అతనికి ధనధాన్యాలకు కొదువ లేకపోయినా, సంతానం లేకపోవడంతో ఆ దంపతుల జీవితం అసంపూర్ణంగా అనిపించేది. ప్రతిరోజూ వారు దేవుళ్లను ప్రార్థించేవారు. ఒకరోజు వారి ఇంటికి వచ్చిన సన్గాసి, వారి అదృష్టంలో సంతాన యోగం లేదని చెప్పాడు. అది విని కుంగిపోయిన ఆ దంపతులు సన్యాసి పాదాలపై పడి ఉపాయం కోరారు.
అప్పుడు ఆ సన్యాసి మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలని సూచించాడు. భక్తి, సంయమనం, సంపూర్ణ విశ్వాసంతో ఈ వ్రతం చేస్తే అమ్మవారు కచ్చితంగా కరుణిస్తారని చెప్పాడు. ఆ దంపతులు శ్రావణ మాసంలో ప్రతీ మంగళవారం భక్తిశ్రద్ధలతో వ్రతం ఆచరించడం ప్రారంభించారు. అమ్మవారి విగ్రహం ఎదుట దీపం వెలిగించి, ఎర్రటి పూలు, సౌభాగ్య సామాగ్రిని సమర్పించి పూజలు చేశారు. పేదలకు అన్నదానం చేశారు.
కొన్ని రోజులకు అమ్మవారు స్వప్నంలో ప్రత్యక్షమై, త్వరలోనే తేజస్సు గల పుత్రుడు జన్మిస్తాడని ఆశీర్వాదం అందించారు. ఆ దంపతులకు కొడుకు పుట్టడంతో నగరంలో ఆనందాలు వెల్లివిరిశాయి. ఆ కుమారుడికి వివాహం జరిగిన తర్వాత, కొద్దికాలానికే ఆ యువకుడి ఆయువుకు గండం ఉందని జ్యోతిష్యులు చెప్పడంతో కుటుంబం ఆందోళన చెందింది. అయితే, భార్య మాత్రం ధైర్యం కోల్పోకుండా అమ్మవారిని నమ్మి నిత్యం మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తూ భర్త దీర్ఘాయువును కోరుకుంది. అమ్మవారి కృపతో ఆ గండం గడిచిపోయి, ఆ యువకుడి ప్రాణాలు నిలిచాయి. అందుకే ఈ వ్రతాన్ని ఆచరిస్తే కుటుంబంపై వచ్చే ఆపదలు తొలగిపోతాయని నమ్ముతారు.
పూజా విధానం మరియు నేటి శుభ ముహూర్తాలు
{{/usCountry}}కొన్ని రోజులకు అమ్మవారు స్వప్నంలో ప్రత్యక్షమై, త్వరలోనే తేజస్సు గల పుత్రుడు జన్మిస్తాడని ఆశీర్వాదం అందించారు. ఆ దంపతులకు కొడుకు పుట్టడంతో నగరంలో ఆనందాలు వెల్లివిరిశాయి. ఆ కుమారుడికి వివాహం జరిగిన తర్వాత, కొద్దికాలానికే ఆ యువకుడి ఆయువుకు గండం ఉందని జ్యోతిష్యులు చెప్పడంతో కుటుంబం ఆందోళన చెందింది. అయితే, భార్య మాత్రం ధైర్యం కోల్పోకుండా అమ్మవారిని నమ్మి నిత్యం మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తూ భర్త దీర్ఘాయువును కోరుకుంది. అమ్మవారి కృపతో ఆ గండం గడిచిపోయి, ఆ యువకుడి ప్రాణాలు నిలిచాయి. అందుకే ఈ వ్రతాన్ని ఆచరిస్తే కుటుంబంపై వచ్చే ఆపదలు తొలగిపోతాయని నమ్ముతారు.
పూజా విధానం మరియు నేటి శుభ ముహూర్తాలు
{{/usCountry}}ఈ పవిత్ర రోజున ఉదయాన్నే తలస్నానం చేసి వ్రత సంకల్పం తీసుకోవాలి. శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేసి, శివపార్వతులను విధివిధానంగా పూజించాలి. సూర్యాస్తాంతరం ప్రదోష కాలంలో పాలు, పెరుగు, నెయ్యి, గంగాజలం, తేనెతో శివలింగానికి అభిషేకం చేయాలి. పార్వతీదేవికి అలంకరణ సామాగ్రిని సమర్పించాలి.
నేటి శుభ ముహూర్తాలు:
బ్రహ్మ ముహూర్తం: ఉదయం 04:25 నుండి 05:08 వరకు
అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 11:59 నుండి 12:51 వరకు
అమృత కాలం: రాత్రి 09:19 నుండి 11:02 వరకు
రవి యోగం: రోజంతా ఉంది.
పాటించవలసిన ముఖ్యమైన నియమాలు
మంగళ గౌరీ వ్రతానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయ నియమాలు ఉన్నాయి. ఈ సంవత్సరమే వివాహం జరిగి, తొలి శ్రావణం జరుపుకుంటున్న నవ వధువులు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆ తర్వాత మిగిలిన నాలుగు సంవత్సరాలు అత్తవారింట ఈ వ్రతాన్ని కొనసాగించాలి. వివాహం జరిగిన మొదటి ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని క్రమం తప్పకుండా చేయడం ఆనవాయితీ.