వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో ఈ 6 వస్తువులను పెడితే ఐశ్వర్యం కలుగుతుంది, డబ్బు కొరత ఉండదు!
వాస్తు ప్రకారం పాటించడం వలన సమస్యలు లేకుండా ఉండొచ్చు. వాస్తు ప్రకారం పాటించడం వలన దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చాలా మంది ప్రతిరోజూ కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పర్సులో ఈ మార్పులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది.
చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన అనేక విధాలుగా లాభాలను పొందడానికి వీలవుతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన సమస్యలు లేకుండా ఉండొచ్చు. వాస్తు ప్రకారం పాటించడం వలన దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చాలా మంది ప్రతిరోజూ కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

వాస్తు ప్రకారం పర్సులో ఈ మార్పులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు, డబ్బుకి లోటు ఉండదు. మరి పర్సులో వేటిని పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో వీటిని పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి
అక్షింతలు:
బియ్యం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అక్షింతలను 21 గింజలు ఉండేటట్టు చూసుకుని వాటిని పర్సులో ఒక చిన్న కవర్లో పెట్టండి. ఇలా చేయడం వలన ఖర్చులు తగ్గుతాయి. అనవసరమైన ఖర్చులు ఉండవు. పర్సులో ఎప్పుడూ డబ్బు ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.
ఎర్రటి కాగితం:
ఎరుపు రంగు సంపదకు చిహ్నం. ఒక చిన్న ఎర్ర కాగితాన్ని తీసుకుని దానిపై మీ మనసులోని కోరికను రాసి పెట్టండి. ఆ తర్వాత ఆ కాగితాన్ని ఎర్రటి దారంతో కట్టేసి పర్సులో పెట్టుకోండి. ఈ విధంగా పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించడంతో పాటు లక్ష్యాన్ని కూడా చేరుకోవచ్చు.
రావి ఆకులు:
రావి చెట్టు చాలా పవిత్రమైనది. రావి ఆకును తీసి గంగాజలంతో శుభ్రం చేసి, దాని పై కుంకుమతో “శ్రీ” అని రాసి పర్సులో ఉంచండి. ఈ విధంగా చేయడం వలన ధన యోగాన్ని పొందవచ్చు. ఆకు ఎండిపోయినప్పుడు కొత్త ఆకుని పెట్టి, పాత ఆకుని పచ్చని మొక్కలలో వేసేయండి.
లక్ష్మీ గవ్వలు:
లక్ష్మీ గవ్వలను పర్సులో ఉంచడం వలన ఆర్థిక సమస్యలు ఉండవు. ఐశ్వర్యం కలుగుతుంది. ఆనందంగా ఉండొచ్చు. డబ్బు కొరత ఉండదు. కనుక వీటిని కూడా మీ పర్సులో ఉండేలా చూసుకోండి.
వెండి నాణెం:
ఒక చిన్న వెండి నాణాన్ని పర్సులో పెడితే ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. సంపద పెరుగుతుంది. అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి.
యాలకులు:
యాలకులను పర్సులో పెడితే కూడా అనేక లాభాలు కలుగుతాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. యాలకులు బుధ గ్రహానికి సంబంధించినవి. కనుక రెండు లేదా మూడు యాలకులను మీ పర్సులో పెట్టండి. దీంతో అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. బుధుడు ధనం, వ్యాపారం మొదలైన వాటిని అందిస్తాడు. పర్సులో యాలకులను పెడితే ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


