తులారాశిలోకి శుక్రుడు - సెప్టెంబర్ 2 నుంచి ఈ 7 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
సెప్టెంబర్ 2న శుక్రుడు… తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. నవంబర్ 6 వరకు కొనసాగే ఈ గోచారంతో 7 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, కెరీర్లో ఊహించని ప్రగతి లభించనున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో భోగభాగ్యాలు, సౌందర్యం, ఆకర్షణ, లగ్జరీ జీవితానికి శుక్రుడిని అధిపతిగా పరిగణిస్తారు. శుక్రుడి అనుగ్రహం ఉంటే సమాజంలో పేరుప్రతిష్టలతో పాటు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. కాగా… సెప్టెంబర్ నెలలో శుక్రుడి గోచారంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ప్రస్తుతం ఆగస్టు 1 నుంచి కన్యారాశిలో సంచరిస్తున్న శుక్రుడు, సెప్టెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 1:51 గంటలకు తన స్వక్షేత్రమైన తులారాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు.

స్వరాశి అయిన తులా రాశిలో శుక్రుడి ప్రవేశం వల్ల మొత్తం 7 రాశుల వారికి అత్యంత అనుకూల ఫలితాలు దక్కనున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 6 వరకు ఈ రాశుల వారి జీవితాల్లో సంతోషం, శాంతి వెల్లివిరుస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఊహించని ధనలాభాలు కలగడంతో పాటు, నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. పాత సమస్యలు తొలగిపోయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
మేష రాశి :
తులా రాశిలోకి శుక్రుడి ప్రవేశం మేష రాశి వారి జీవితంలో స్పష్టమైన సానుకూల మార్పులను తెస్తుంది. ఉద్యోగం మరియు వ్యక్తిగత బంధాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. గతంతో పోలిస్తే పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు లేదా వేరే ప్రాంతాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు సమకూరుతాయి. భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది.
కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారికి ఈ శుక్ర సంచారం భౌతిక సుఖసంతోషాలను పెంచుతుంది. వృత్తిపరంగా ఆఫీసులో మీ పనితీరుకు పైఅధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు లాభదాయకమైన కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కుటుంబంలో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి గతానికంటే చాలా బలంగా మారుతుంది.
కన్యా రాశి :
కన్యా రాశి వారికి సెప్టెంబర్ 2 నుంచి ఆర్థికంగా అనుకూలమైన రోజులు ప్రారంభమవుతాయి. నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు సుగమమవుతాయి. ఉద్యోగం మారాలనే ఆలోచనలో ఉన్నవారికి కోరుకున్న చోట అవకాశాలు దక్కుతాయి. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్లే అవకాశముంది. భాగస్వామితో మానసిక అనుబంధం పెరుగుతుంది.
తులా రాశి :
శుక్రుడు తన సొంత రాశి అయిన తులా రాశిలోనే సంచరించబోతుండటంతో, ఈ రాశి వారికి సెప్టెంబర్ 2 తర్వాత సువర్ణాధ్యాయం ప్రారంభం కానుంది. మీలో ఆత్మవిశ్వాసం, ఆకర్షణ విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో స్వర్ణ యుగం నడుస్తుంది. గతంలో నిలిచిపోయిన ధన సంబంధిత పనులన్నీ వేగవంతమవుతాయి. బంధువులతో, భాగస్వామితో అనుబంధం మరింత గట్టిపడుతుంది.
కుంభ రాశి :
కుంభ రాశి వారికి ఈ శుక్ర గోచారం ఆర్థిక విషయాల్లో గొప్ప ఊరటను ఇస్తుంది. ఉద్యోగంలో ఏదైనా సమస్య ఎదురవుతుంటే సెప్టెంబర్ 2 నుంచి ఆ పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు లేదా వెంచర్లపై పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. లగ్జరీ వస్తువులు, సౌకర్యాల కోసం కొంత ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే అవకాశముంది.
మకర రాశి:
మకర రాశి వారికి సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 6 వరకు ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది. కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి. నూతన ప్రాజెక్టుల వల్ల ఆశించిన ప్రయోజనాలు అందుతాయి. నిలకడగా పనులన్నీ పూర్తవుతాయి. కొత్త ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తారు. ఆదాయం మరియు ఖర్చుల మధ్య సరైన సమతుల్యత ఏర్పడుతుంది.
ధనుస్సు రాశి :
ధనుస్సు రాశి వారికి ఈ సంచారం ధన లాభాలను, మధురమైన బంధాలను అందిస్తుంది. ఆదాయం పెంచుకోవడానికి నూతన మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని రాబడి లభిస్తుంది. ఇప్పటివరకు ఉన్న ఆర్థిక ఒత్తిళ్లు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

