శ్రావణమాసం చాలా విశేషమైన మాసం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలు అందరూ కూడా ఆచరిస్తారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరీ దేవి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. అయితే ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు వచ్చింది? తేదీ, ప్రాముఖ్యతతో పాటు అసలు ఎందుకు ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో చేసుకోవాలి వంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
వరలక్ష్మీ వ్రతం 2026 తేదీ

ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21, శుక్రవారం నాడు వచ్చింది. ప్రతి ఏడాది శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. మహాలక్ష్మీ దేవిని ప్రత్యేకించి కొలుస్తారు. దీపం, ధూపం, నైవేద్యాలను సమర్పిస్తారు. కొత్త చీర, జాకెట్ ముక్క, ఆభరణాలు, డబ్బులు ఇలా ఎవరికి నచ్చినట్లు వారు కొనుగోలు చేసి వరలక్ష్మీ దేవికి సమర్పించి, ఆ తర్వాత వాటిని ధరిస్తారు.
వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత
'వర' అంటే వరం. వరలక్ష్మి అంటే అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి. వరలక్ష్మీ దేవిని ఆరాధించడం వల్ల సంపద, ఆరోగ్యం, ధైర్యం, సంతానం మొదలైనవి కలుగుతాయని నమ్మకం.
వివాహిత స్త్రీలు భర్త ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబం క్షేమంగా ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ దేవిని పూజించడం వల్ల అష్టలక్ష్ములను పూజించిన ఫలితం లభిస్తుందని చెబుతారు.
ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి
"ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అద్భుతమైన ఫలితాన్ని చూడొచ్చు. అలాగే శ్రీ సూక్తం పారాయణం చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు.
వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు కలశం ఎందుకు పెడతారు?
కలశం అంటే శుభానికి, సంపదకు, దైవ సాన్నిధ్యానికి ప్రతీక. కచ్చితంగా వరలక్ష్మీ దేవిని ఆరాధించేటప్పుడు కలశాన్ని ఏర్పాటు చేసి పూజ చేయాలి. కొబ్బరికాయ, మామిడి ఆకులతో అమ్మవారి ముఖాన్ని అలంకరించిన కలశాన్ని తప్పకుండా ప్రతిష్ఠించి పూజించాలి.
{{/usCountry}}కలశం అంటే శుభానికి, సంపదకు, దైవ సాన్నిధ్యానికి ప్రతీక. కచ్చితంగా వరలక్ష్మీ దేవిని ఆరాధించేటప్పుడు కలశాన్ని ఏర్పాటు చేసి పూజ చేయాలి. కొబ్బరికాయ, మామిడి ఆకులతో అమ్మవారి ముఖాన్ని అలంకరించిన కలశాన్ని తప్పకుండా ప్రతిష్ఠించి పూజించాలి.
{{/usCountry}}అలాగే తొమ్మిది ముడులు వేసిన తోరాన్ని పూజ చేసి చేతికి కట్టుకోవాలి. ఆరోజు కచ్చితంగా వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదివి అమ్మవారికి పుష్పాలతో పూజ చేయాలి.
పూజ ఎలా చేసుకోవాలి?
శుభ్రమైన ప్రదేశంలో బియ్యం మీద కలశాన్ని ఏర్పాటు చేయాలి. దానిపై కొబ్బరికాయ, మామిడి ఆకులు ఉంచి అమ్మవారి ముఖంతో అలంకరించాలి. కుంకుమ, పసుపు, పూలు, గాజులు, నైవేద్యం వంటి పూజా సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకుని అమ్మవారికి సమర్పించాలి.
ఆ రోజు ఇంటిని శుభ్రంగా కడిగి, ముగ్గులు వేసి, కలశ స్థాపన చేసి లక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజలు చేయాలి. అలాగే ఇంటికి ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తే మరింత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు.
ఈ వ్రతాన్ని ఎందుకు శ్రావణమాసంలో జరుపుకోవాలి?
ఈ వ్రతం వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. చారుమతి అనే పవిత్రమైన స్త్రీకి ఒక రోజు లక్ష్మీదేవి స్వప్నంలో దర్శనమిచ్చి, ఈ వ్రతాన్ని ఆచరిస్తే అన్ని కోరికలు నెరవేరుస్తానని చెప్పింది. చారుమతి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలు లభించాయి. అప్పటి నుంచి మహిళలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు.
ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్టలక్ష్ములను ఆరాధించిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనధాన్యాలకు కొరత ఉండదు. సంతానం లేని వారికి సంతానం కలిగే భాగ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇంటి నుంచి ప్రతికూల శక్తులు తొలగిపోయి ప్రశాంతత, సంతోషం నెలకొంటాయని భక్తుల నమ్మకం.