మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సే సుక్కా అలియాస్ దేవా సహా 20 మంది కీలక సభ్యులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో బర్సే సుక్కా అలియాస్ దేవాతో పాటు తెలంగాణా రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, ఆయన అనుచరులు కూడా ఉన్నారు.
కీలక నేతగా బరిసె దేవా…!

మావోయిస్టు అగ్రనేత హిడ్మా తర్వాత బర్సే సుక్కా అలియాస్ దేవా కీలక నేతగా పేరొందారు. గిరిజన వర్గం నుంచి రెండో అతి పెద్ద నాయకుడిగా బరిసె దేవా ఉన్నాడు. 2003లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆయన… సైనిక వ్యూహం, పేలుడు పదార్థాలు, తుపాకీలు, ఐఈడీల తయారీలో నిపుణుడిగా రాణించాడు. వ్యూహకర్తగా పార్టీలో మంచి పేరును సంపాదించాడు. ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి మహేంద్ర కర్మతో పాటు ఇతర ఘటనల్లో కీలక వ్యక్తిగా ఉన్నాడు.ఆయనపై రూ.75 లక్షల రివార్డు ఉంది. కర్రెగుట్టల్లో గెరిల్లా స్థావరాన్ని స్థాపించటంలో రాజిరెడ్డి కీలక పాత్ర పోషించారు.
లొంగిపోయిన 20 మంది మావోయిస్టులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సహాయ, పునరావాస విధానంలో భాగంగా మొత్తం రూ .1.82 కోట్ల రివార్డ్ మొత్తాన్ని ఇవ్వనున్నారు. లొంగిపోయిన వారికి గౌరవమైన మరియు భద్రతతో కూడిన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి వీలు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ హామీ ఇచ్చింది.
డీజీపీ కామెంట్స్….
మావోయిస్టు పార్టీకి చెందిన PLGA బెటాలియన్ పూర్తిగా క్షీణించిందని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు “గతంలో 400 మందికి పైగా సభ్యులు ఉండగా..ప్రస్తుతం 66 మంది మాత్రమే ఉన్నారు. నాయకత్వం కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చారు కాబట్టి మిగిలిన వారు ఆలోచించుకోవాలి. వారికి ప్రభుత్వం, పోలీసుశాఖ తరుపున సహకరిస్తాం” అని పిలుపునిచ్చారు.
“అజ్ఞాతం నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చిన 20 మంది మావోయిస్టులు మొత్తం 48 ఆయుధాలతో లొంగిపోయారు. అందులో అత్యాధునిక ఆయుధాలు, తూటాలు, గ్రనైడ్స్ ఉన్నాయి.గతేడాది పోలీసు అమరవీరుల స్మృతి దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపును అందుకొని మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. వారికి ప్రభుత్వం, పోలీసు శాఖ తరుపున పూర్తి సహకారం ఉంటుంది.మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం కేవలం 17 మంది మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. వారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వం, పోలీసుశాఖ తరుపున అవసరమైన సహయం అందుతుంది” అని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.
{{/usCountry}}“అజ్ఞాతం నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చిన 20 మంది మావోయిస్టులు మొత్తం 48 ఆయుధాలతో లొంగిపోయారు. అందులో అత్యాధునిక ఆయుధాలు, తూటాలు, గ్రనైడ్స్ ఉన్నాయి.గతేడాది పోలీసు అమరవీరుల స్మృతి దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపును అందుకొని మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. వారికి ప్రభుత్వం, పోలీసు శాఖ తరుపున పూర్తి సహకారం ఉంటుంది.మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం కేవలం 17 మంది మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. వారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వం, పోలీసుశాఖ తరుపున అవసరమైన సహయం అందుతుంది” అని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.
{{/usCountry}}