హైదరాబాద్ నగర పరిధిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సు (21) అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన నగరవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మొదట దీనిని అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, పోలీసుల లోతైన విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది కేవలం మరణం కాదని, అత్యాచార యత్నాన్ని అడ్డుకునే క్రమంలో జరిగిన హత్య అని అధికారులు నిర్ధారించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి తన కాళ్లపై తాను నిలబడి కుటుంబానికి ఆసరాగా ఉండాలనే సంకల్పంతో ఏడు నెలల క్రితం హైదరాబాద్కు వచ్చింది. మహేశ్వరంలోని బంధువుల ఇంట్లో ఉండేది. ఆ తర్వాత ఒక స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా విధుల్లో చేరింది. ఆసుపత్రి యాజమాన్యం కేటాయించిన గదిలోనే ఉంటూ రోజువారీ విధులు నిర్వర్తించేది.
శనివారం మధ్యాహ్నం తన గదికి వెళ్లిన ఆ యువతి ఎంతకీ తిరిగొచ్చి విధుల్లో చేరకపోవడంతో ఆసుపత్రి వర్గాలు ఆందోళన చెందాయి. ఫోన్ చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో సిబ్బందిని ఆమె గదికి పంపించారు. లోపల నుంచి తలుపు గడియ పెట్టి ఉండటం, అనుమానం వచ్చి కిటికీ గుండా చూడగా ఆమె నేలపై స్పృహతప్పి పడివుండటం గమనించారు. వెంటనే తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లగా, అప్పటికే ఆ యువతి ప్రాణాలు అనంత వాయువుల్లో కలసిపోయాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పహాడీషరీఫ్ పోలీసులు, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. బాధితురాలి శరీరంపై గాయాల గుర్తులు ఉండటంతో, బంధువుల ఫిర్యాదు మేరకు హత్యాకోణంలో విచారణ చేపట్టారు. సమీప పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజ్, విశ్లేషించిన పోలీసులు బిహార్కు చెందిన సైనా ఉల్లా అనే వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించారు. అతను ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా, తనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకున్నాడు.
నిందితుడు సైనా ఉల్లా.. మధ్యాహ్నం వేళ నర్సు ఒంటరిగా ఉందనే విషయాన్ని గమనించి, కిటికీ మార్గం ద్వారా గదిలోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించగా బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. ఆమె వేసే కేకలు బయటకు రాకుండా గొంతును గట్టిగా నొక్కిపెట్టడంతో ఊపిరాడక ఆ యువ నర్సు అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
{{/usCountry}}నిందితుడు సైనా ఉల్లా.. మధ్యాహ్నం వేళ నర్సు ఒంటరిగా ఉందనే విషయాన్ని గమనించి, కిటికీ మార్గం ద్వారా గదిలోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించగా బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. ఆమె వేసే కేకలు బయటకు రాకుండా గొంతును గట్టిగా నొక్కిపెట్టడంతో ఊపిరాడక ఆ యువ నర్సు అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
{{/usCountry}}నమ్మకంతో నగరానికి పంపిన తమ కుమార్తె దారుణంగా హత్యకు గురైందని తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, బీజేపీ స్థానిక నాయకులు, బాధితురాలి బంధువులతో కలిసి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.