SCR Tirupati Karimnagar Express : తిరుపతి నుంచి కరీంనగర్ వైపు ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. రైళ్ల నిర్వహణ సజావుగా సాగించేందుకు, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా టైమింగ్స్ షెడ్యూల్(తిరుపతి - కరీంనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ - 12761) లో పలు మార్పులు చేసింది. ఈ సవరించిన రైలు వేళలు 2026 అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
టైమింగ్స్ మార్పు - వివరాలు….

ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం తిరుపతి స్టేషన్ నుంచి రాత్రి 08:05 గంటలకు బయల్దేరే ఈ రైలు…. ఇకపై 15 నిమిషాల ముందే అంటే రాత్రి 07:50 గంటలకే ప్లాట్ఫాం వదిలి బయల్దేరుతుంది.
దీంతో పాటు దారిలోని ప్రధాన స్టేషన్లు, నిష్క్రమణ సమయాల్లో కూడా రైల్వే శాఖ తగిన మార్పులు చేసింది. రేణిగుంట స్టేషన్కు ప్రస్తుతం రాత్రి 08:28 గంటలకు వచ్చి 08:30కి బయల్దేరుతున్న ఈ ఎక్స్ప్రెస్…. కొత్త షెడ్యూల్ ప్రకారం రాత్రి 08:15 గంటలకే చేరుకుని 08:17 గంటలకు బయల్దేరుతుంది.
అలాగే శ్రీకాళహస్తి స్టేషన్కు ప్రస్తుతం ఉన్న రాత్రి 08:54 / 08:55 సమయాలకు బదులుగా…. ఇకపై రాత్రి 08:39 గంటలకే చేరుకుని 08:40 గంటలకు బయల్దేరుతుందని అధికారులు వెల్లడించారు.
తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి స్టేషన్లలో మాత్రమే ఈ సమయాల మార్పు వర్తిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి (సీపీఆర్ఓ) శ్రీధర్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మూడు స్టేషన్ల తర్వాత మార్గమధ్యంలో వచ్చే మిగతా అన్ని రైల్వే స్టేషన్లలోనూ రైలు చేరే, బయల్దేరే సమయాల్లో ఎలాంటి మార్పులూ ఉండవని…. పాత షెడ్యూల్ ప్రకారమే రైలు నడుస్తుందని ఆయన వివరించారు.
అక్టోబర్ 10 లేదా ఆ తర్వాత ఈ రైలులో ప్రయాణించడానికి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ కొత్త వేళలను గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. సమయానికి అనుగుణంగా స్టేషన్కు చేరుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని పేర్కొంది.
{{/usCountry}}అక్టోబర్ 10 లేదా ఆ తర్వాత ఈ రైలులో ప్రయాణించడానికి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ కొత్త వేళలను గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. సమయానికి అనుగుణంగా స్టేషన్కు చేరుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని పేర్కొంది.
{{/usCountry}}