CM Revanth On Asara Pensions : రాష్ట్రంలోవని పెన్షన్ లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా, వేగంగా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు వివిధ వర్గాలకు అందిస్తున్న సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ విధానంలో మార్పులు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
నేరుగా బ్యాంకు ఖాతాలోకే…

ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా సాగుతున్న పెన్షన్ల పంపిణీ పద్ధతికి స్వస్తి పలికి…. ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే (డీబీటీ విధానం) నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయటం వల్ల ఎలాంటి అవకతవకలకు తావుండకూడదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెన్షన్ కేవలం నిజమైన, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందేలా కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఓటర్ గుర్తింపు కార్డు (ఓటర్ ఐడీ), ఆధార్ కార్డు, మరియు ఎస్ఈఈఈపీసీ (SEEEPC) సర్వే డేటాను క్షుణ్ణంగా పరిశీలించి…. వాటి ఆధారంగానే లబ్ధిదారుల జాబితాను క్రమబద్ధీకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అనర్హుల చేతుల్లోకి ప్రభుత్వ సొమ్ము వెళ్లకుండా అడ్డుకట్ట వేయడమే ఈ స్క్రీనింగ్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఒకటో తారీఖునే జీతాలు - సీఎం ఆదేశాలు
రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు నెలనెలా సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా వేతనాలు అందాలని స్పష్టం చేశారు. మ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ. 50కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోమన్నారు. సొంత ఆదాయంపై గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
{{/usCountry}}అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోమన్నారు. సొంత ఆదాయంపై గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
{{/usCountry}}పంచాయతీరాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 70 (3) ప్రతిపాదిత సవరణ ప్రకారం గ్రామ పంచాయతీ స్వంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా సవరణ చేయాలని అధికారులను ఆదేశించారు.