Singareni Battery Energy Storage System : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (BESS) అద్భుత ఫలితాలను ఇస్తోంది. పగటిపూట సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్లో….. స్థానిక అవసరాలకు పోను మిగిలిపోయే కరెంటును వృథాగా గ్రిడ్కు వదలకుండా ఈ బ్యాటరీ వ్యవస్థలో నిల్వ చేస్తున్నారు. ఇలా దాచిన విద్యుత్ను డిమాండ్ ఉన్న సమయంలో తిరిగి వినియోగించుకుంటూ సింగరేణి సంస్థ భారీగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతోంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మార్గదర్శకాలకు అనుగుణంగా నాలుగు నెలల క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్కు అనుబంధంగా 1 మెగావాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ను నెలకొల్పారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం సింగరేణి యాజమాన్యం రూ. 2.5 కోట్లను వెచ్చించింది.
అసలు ఏంటి బీఈఎస్ఎస్ (BESS)….?
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరుల (సౌర విద్యుత్) ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే సింగరేణి సంస్థ ఇప్పటివరకు 8 ప్రాంతాల్లో మొత్తం 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను నిర్మించింది. వీటిలో 147 మెగావాట్ల ప్లాంట్లను 'ఓపెన్ యాక్సెస్' ప్లాంట్లుగా, మిగిలిన 98.50 మెగావాట్ల ప్లాంట్లను 'ఇన్-హౌస్' ప్లాంట్లుగా వర్గీకరించి తెలంగాణ విద్యుత్ గ్రిడ్కు అనుసంధానించారు.
ఇక్కడే అసలైన సవాలు ఎదురైంది. ఇన్-హౌస్ ప్లాంట్ల నుండి వచ్చే విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేసినప్పటికీ…. ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (PPA) ప్రకారం స్థానిక అవసరాలకు వాడగా మిగిలిపోయే అదనపు విద్యుత్కు తెలంగాణ డిస్కమ్లు ఎలాంటి చెల్లింపులు చేయవు. ఆ మిగులు విద్యుత్ను ఉచితంగానే గ్రిడ్కు సరఫరా చేయాల్సి వచ్చేది. దీనివల్ల రోజుకు వేలాది యూనిట్ల సౌర విద్యుత్ రూపంలో సింగరేణికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం దక్కేది కాదు. ఈ నష్టాన్ని నివారించి, ప్రతి యూనిట్ విద్యుత్ను సొమ్ము చేసుకోవాలనే లక్ష్యంతోనే మందమర్రిలో ఈ ప్రయోగాత్మక బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థను తీసుకొచ్చారు.
రూ.25 లక్షలు ఆదా….
మందమర్రిలోని 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రస్తుతం అత్యంత సమర్థంగా పనిచేస్తోంది. ఇది మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లోని గనులు, కార్యాలయాలు, కార్మిక కాలనీలకు అవసరమైన విద్యుత్ను నిరంతరం అందిస్తోంది. అయితే, పగటిపూట ఈ ప్రాంతాల స్థానిక అవసరాలకు పోను ఇంకా భారీగా విద్యుత్ మిగిలిపోతోంది. దీనిని నిల్వ చేసేందుకు గత జనవరి నెలలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు.
{{/usCountry}}మందమర్రిలోని 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రస్తుతం అత్యంత సమర్థంగా పనిచేస్తోంది. ఇది మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లోని గనులు, కార్యాలయాలు, కార్మిక కాలనీలకు అవసరమైన విద్యుత్ను నిరంతరం అందిస్తోంది. అయితే, పగటిపూట ఈ ప్రాంతాల స్థానిక అవసరాలకు పోను ఇంకా భారీగా విద్యుత్ మిగిలిపోతోంది. దీనిని నిల్వ చేసేందుకు గత జనవరి నెలలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు.
{{/usCountry}}జనవరిలో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఈ బీఈఎస్ఎస్ యూనిట్ ద్వారా స్థానికంగా వాడగా మిగిలిన 3,35,485 యూనిట్ల విద్యుత్ను విజయవంతంగా బ్యాటరీలలో నిల్వ చేశారు. ఆ తర్వాత గనుల అవసరాలకు, పీక్ అవర్స్లో ఈ విద్యుత్ను వాడుకున్నారు. తద్వారా కేవలం నాలుగు నెలల కాలంలోనే సింగరేణి సంస్థకు రూ. 25,66,460 ల ఆర్థిక లబ్ధి చేకూరింది. కేవలం ఒక మెగావాట్ సామర్థ్యం ఉన్న చిన్న యూనిట్ ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ను….. ప్రభుత్వ సొమ్మును ఆదా చేయడం పట్ల విద్యుత్ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సరికొత్త ఇంధన నిల్వ విధానం (BESS) వంద శాతం విజయవంతం కావడం పట్ల సింగరేణి యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. పర్యావరణహిత హరిత ఇంధనాన్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా, రాబోయే రోజుల్లో మరిన్ని సోలార్ ప్లాంట్ల వద్ద ఇలాంటి బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టులను విస్తరిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది.