మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పుడ్ పాయిజన్ అయినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే జీవన్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కొన్ని రోజులుగా మున్సిపల్ ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్నారు జీవన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఛైర్మన్ పదవి తన వర్గానికి చెందినవారికే రావాలని ప్రయత్నాలు చేశారు. ఎలక్షన్ బిజీలో పడి ఆయన సరిగా ఆహారం తీసుకోకపోవడం కూడా అస్వస్థతకు కారణంగా పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఎక్కువగా బయట తిరగడం కూడా జీవన్ రెడ్డి ఆరోగ్యంపై ప్రభావం పడింది.
జగిత్యాలలో కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నడుస్తోంది. ఇటు ఎమ్మెల్యే సంజయ్ వర్గం, అటు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఇదే మున్సిపల్ ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించింది. జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత లభించడం లేదనే వాదన బలంగా జనాల్లోకి వెళ్లింది. మెుదటి నుంచి పార్టీలో ఉన్న తనకు, తన వర్గానికి సరైన గౌరవం దక్కడం లేదని జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానంపై మరింత వివాదం చెలరేగింది.
ఈ పంచాయితీకి ఫుల్స్టాప్ పెట్టేందుకు ఏఐసీసీ జీవన్ రెడ్డి, సంజయ్తో కీలక చర్చలు చేశారు. ఇటీవల మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ విడివిడిగా సమావేశం అయ్యారు. ప్రజా భవన్లోనే సవాంగ్ను కలిశారు. పార్టీ అంతర్గత విషయాలను రోడ్డుపైకి తీసుకురావడంతో కేడర్లో అయోమయం ఉందని ఇరువురి నేతలను హెచ్చరించింది అధిష్ఠానం.
కాంగ్రెస్ హైకమాండ్ జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య రెండు ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తోంది. మెుదటిది ఛైర్ పర్సన్ పీఠం సంజయ్ వర్గానికి, వైస్ ఛైర్మన్ పదవి జీవన్ వర్గానికి. అయితే రెండో ప్రతిపాదన.. చెరో రెండున్నర సంవత్సరాలు ఛైర్ పర్సన్ పీఠం పంచుకునేలా సూచించారు. జీవన్ రెడ్డి మాత్రం.. కాంగ్రెస్ జెండా మోసిన వారికే ఛైర్ పర్సన్ పీఠం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
{{/usCountry}}కాంగ్రెస్ హైకమాండ్ జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య రెండు ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తోంది. మెుదటిది ఛైర్ పర్సన్ పీఠం సంజయ్ వర్గానికి, వైస్ ఛైర్మన్ పదవి జీవన్ వర్గానికి. అయితే రెండో ప్రతిపాదన.. చెరో రెండున్నర సంవత్సరాలు ఛైర్ పర్సన్ పీఠం పంచుకునేలా సూచించారు. జీవన్ రెడ్డి మాత్రం.. కాంగ్రెస్ జెండా మోసిన వారికే ఛైర్ పర్సన్ పీఠం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
{{/usCountry}}మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానం ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే దక్కింది. సంజయ్ నిలబెట్టిన సమిండ్ల వాణి ఎన్నికయ్యారు. అయితే జీవన్ రెడ్డి వర్గానికి వైస్ ఛైర్మన్ పదవి ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన వర్గానికి చెందిన జీనత్ ఫర్విన్ వైస్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది.