ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. విద్యార్థులను ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా రాబోయే విద్యా సంవత్సరం(2026–27) నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలిపింది యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థిక, పరిపాలనా పరిశీలనలో ఉందని ఇంటర్ విద్యా మండలి అధికారులు తెలిపారు. తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులతో సమానంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ప్రయోజనాన్ని అందించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదిత పథకం తెలంగాణ అంతటా దాదాపు 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమం అంచనా వ్యయం సంవత్సరానికి సుమారు రూ. 180 కోట్లు, ఆహారం, పోషకాహార సప్లిమెంట్లతో సహా ఒక్కో విద్యార్థికి దాదాపు రూ. 13.5 ఖర్చు అవుతుంది. పైలట్ కార్యక్రమాలలో భాగంగా కొండంగల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఇదే నమూనాను అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా అమలుపై నిర్ణయం తీసుకునే ముందు అధికారులు ప్రస్తుతం అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల ప్రభావం, సాధ్యాసాధ్యాలను సమీక్షిస్తున్నారు. ఈ పథకాలను జూనియర్ కళాశాలలకు విస్తరించడం వల్ల డ్రాపౌట్ రేట్లు తగ్గుతాయని, ప్రభుత్వ సంస్థలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నమోదు పెరుగుతుందని ఇంటర్ విద్యామండలి అధికారులు అధికారులు భావిస్తున్నారు.
మధ్యాహ్న భోజన కార్యక్రమం విద్యార్థుల శారీరక, మానసిక శ్రేయస్సును బలోపేతం చేసే దిశగా ఒక అడుగు అని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల జరిగిన చర్చల సందర్భంగా చాలా కాలేజీలు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో ఉన్నాయని అధికారులు తెలిపారు. మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలు తప్పనిసరి అని తెలియజేశారు. ఈ పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు. బడ్జెట్ ఆమోదానికి లోబడి ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు.
{{/usCountry}}మధ్యాహ్న భోజన కార్యక్రమం విద్యార్థుల శారీరక, మానసిక శ్రేయస్సును బలోపేతం చేసే దిశగా ఒక అడుగు అని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల జరిగిన చర్చల సందర్భంగా చాలా కాలేజీలు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో ఉన్నాయని అధికారులు తెలిపారు. మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలు తప్పనిసరి అని తెలియజేశారు. ఈ పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు. బడ్జెట్ ఆమోదానికి లోబడి ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు.
{{/usCountry}}