తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రముఖ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు సరికొత్త రికార్డు సృష్టించారు. భారతదేశ వైద్య చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒకే రోగికి ఒకే సమయంలో ఐదు అవయవాలను అమర్చారు. అత్యంత సంక్లిష్టమైన మల్టీ-విసెరల్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

ఒకే వ్యక్తికి జీర్ణాశయం, మ్యూకస్ పొర కలిగిన చిన్నపేగు ప్రారంభ భాగం, క్లోమగ్రంథి, చిన్నపేగు, కుడి వైపు పెద్దపేగులను ఒకే విడతలో మార్పిడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాంతకమైన, అత్యంత అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉస్మానియాలో చేరారు. ఈ రోగి ప్రాణాలను కాపాడేందుకు జూన్ 29న ప్రారంభమైన ఈ శస్త్రచికిత్స సుమారు 36 గంటల పాటు నిరంతరాయంగా సాగి జూన్ 30 సాయంత్రానికి ముగిసింది. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ అద్భుత విజయంపై జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ స్పందించారు. 'మన ప్రభుత్వ వైద్యుల అసాధారణ ప్రతిభకు, నిబద్ధతకు ఈ విజయం ఒక నిదర్శనం. భారత వైద్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఉస్మానియా వైద్య బృందానికి నా అభినందనలు.' అని కొనియాడారు.
ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్ మాట్లాడుతూ.. నెఫ్రాలజీ, యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, అనస్థీషియా వంటి పలు విభాగాలకు చెందిన నిపుణులు ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్నారని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలోనే బ్రెయిన్ డెడ్గా ప్రకటించిన ఒక మహిళ ఈ ఐదు అవయవాలను దానం చేయడం విశేషం. వీటితో పాటు ఆమె కళ్ళు, చర్మం, కాలేయం, మూత్రపిండాలను కూడా ఇతర రోగుల కోసం దానం చేశారని ఆయన పేర్కొన్నారు.
ఈ సర్జరీ కోసం అంతర్జాతీయంగా ఇలాంటి ఆపరేషన్లు చేసిన విదేశీ వైద్య నిపుణుల సలహాలను కూడా తీసుకున్నట్లు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ హెడ్ డాక్టర్ సి.హెచ్. మధుసూదన్ తెలిపారు. మల్టీ-విసెరల్ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించడం అనేది అరుదైన విషయం అని, దానిని చేయడం గౌరవంగా ఉందని ఆయన అన్నారు.
{{/usCountry}}ఈ సర్జరీ కోసం అంతర్జాతీయంగా ఇలాంటి ఆపరేషన్లు చేసిన విదేశీ వైద్య నిపుణుల సలహాలను కూడా తీసుకున్నట్లు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ హెడ్ డాక్టర్ సి.హెచ్. మధుసూదన్ తెలిపారు. మల్టీ-విసెరల్ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించడం అనేది అరుదైన విషయం అని, దానిని చేయడం గౌరవంగా ఉందని ఆయన అన్నారు.
{{/usCountry}}