Ration Card Name Addition : రేషన్ కార్డులో కొత్త పేర్లను ఎలా నమోదు చేయాలి..? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Ration Card Name Addition : మీ రేషన్ కార్డులో భార్య లేదా పిల్లల పేర్లను సులభంగా చేర్చుకోవచ్చు. మీసేవాలో దరఖాస్తు చేసుకున్న తర్వాత.. అధికారుల నుంచి అఫ్రూవ్ రావాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…. 

Published on: Aug 4, 2026, 09:46:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Ration Card Name Addition : ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలన్నా, సబ్సిడీ రేషన్‌ అందుకోవాలన్నా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డే ప్రామాణికం. అయితే వివాహమైన తర్వాత భార్య పేరును లేదా కొత్తగా పుట్టిన పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చడం చాలా మందికి అవసరం అవుతుంది. ఈ ప్రక్రియ చాలా సులభం. సరైన పత్రాలు ఉంటే మీసేవ కేంద్రం ద్వారా లేదా ఆన్‌లైన్ విధానంలో సులభంగా పేర్లను చేర్చుకోవచ్చు.

రేషన్ కార్డులో కొత్త పేర్ల నమోదు
రేషన్ కార్డులో కొత్త పేర్ల నమోదు

అవసరమైన ముఖ్యమైన ధ్రువీకరణ పత్రాలు…

రేషన్ కార్డులో కొత్తగా పేర్లను చేర్చడానికి పౌర సరఫరాల శాఖ కొన్ని ముఖ్యమైన పత్రాలను నిర్దేశించింది. భార్య పేరు చేర్చాలనుకుంటే…. భార్యకు సంబంధించిన ఆధార్ కార్డుతో పాటు అధికారికంగా జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాలి. కొత్తగా జన్మించిన పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చడానికి వారి మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు అవసరం ఉంటాయి.

మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకునే విధానం…

రేషన్ కార్డులో మార్పులు, చేర్పుల కోసం మీ సమీపంలోని మీసేవా కేంద్రానికి వెళ్లి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • మీసేవా కేంద్రంలో లభించే FSC Correction Form (ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కరెక్షన్ ఫారమ్) తీసుకోవాలి. ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్ పోర్టల్ నుంచి కూడా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఫారమ్‌లో మీ పాత రేషన్ కార్డు నంబర్, కొత్తగా చేర్చాలనుకుంటున్న కుటుంబ సభ్యుని పూర్తి పేరు, చిరునామా, ఆధార్ సంఖ్య తదితర వివరాలను ఏ తప్పులూ లేకుండా స్పష్టంగా రాయాలి.
  • నింపిన దరఖాస్తు ఫారమ్‌కు అవసరమైన ఆధార్, పుట్టిన తేదీ లేదా వివాహ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జత చేసి అందజేయాలి.
  • దరఖాస్తు సమర్పించిన తర్వాత మీసేవా కేంద్రం నుంచి ఇచ్చే రసీదు (Acknowledgment Receipt) ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
  • ఈ రసీదుపై ఉన్న దరఖాస్తు సంఖ్య (Application Number) ఆధారంగానే మీ దరఖాస్తు ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.

స్టేటస్ ఎలా చెక్ చేయాలి….?

మీరు చేసిన దరఖాస్తును అధికారులు పరిశీలించి ఆమోదించారా లేదా అనేది ఇంట్లో కూర్చునే మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలు ఇలా….

  1. ముందుగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
  2. హోం పేజీలో ఎడమ వైపున ఉన్న FSC Search ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  3. ఆ తర్వాత అందులో కనిపించే Ration Cards Search పై క్లిక్ చేస్తే మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.
  4. అందులో FSC Application Search అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  5. మీ జిల్లా పేరును ఎంపిక చేసుకుని, మీసేవా రసీదుపై ఉన్న అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి 'Search' పై క్లిక్ చేయాలి.
  6. వెంటనే మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.
  7. ఒకవేళ మీ పాత రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలను సరిచూసుకోవాలనుకుంటే.. FSC Search లోకి వెళ్లి రేషన్ కార్డు కాలమ్‌లో మీ కార్డు నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే చాలు, కార్డులో నమోదైన సభ్యుల పేర్లన్నీ వివరంగా కనిపిస్తాయి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More