దేశంలో ఐపీఎల్ ఫీవర్ మామూలుగా లేదు. ఇలాంటి సమయంలో చాలా మంది మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎవరు గెలుస్తారు? ఏ టీమ్ మీద బెట్టింగ్ పెట్టాలని కొందరు మీ దగ్గరకు రావొచ్చు. అలాంటి ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలతో విరుచుకుపడుతున్నారని సజ్జనార్ చెప్పారు. కేవలం డబ్బు కోసం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
'టాస్ ఎవరిది!? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది!? అని ముందే చెబుతామంటూ మిమ్మల్ని తమ ఛానెల్స్లో సబ్స్క్రైబ్ చేయించుకుని, నిలువునా ముంచే బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ ఛానెళ్ల మాటలు నమ్మి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు.' అని సజ్జనార్ అన్నారు.
ఇలాంటి ప్రమోషన్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోందని సజ్జనార్ హెచ్చరించారు. గత నెల రోజుల్లోనే 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను బ్లాక్ చేయించామన్నారు.
'ఈ నిఘా నిరంతరం కొనసాగుతుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇలాంటి మోసపూరిత యాడ్స్ మీ దృష్టికి వచ్చినా లేదా మీరు మోసపోయినా, వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయండి.' అని సజ్జనార్ తెలిపారు.
ఐపీఎల్ ట్రాఫిక్.. బాలింత మృతి
ఏప్రిల్ 5, ఆదివారం ఉప్పల్లో జరిగిన ఒక విషాద ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా గంటకు పైగా అంబులెన్స్లో చిక్కుకుపోయిన బిష్ణ అనే 30 ఏళ్ల మహిళ చనిపోయింది.
{{/usCountry}}ఏప్రిల్ 5, ఆదివారం ఉప్పల్లో జరిగిన ఒక విషాద ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా గంటకు పైగా అంబులెన్స్లో చిక్కుకుపోయిన బిష్ణ అనే 30 ఏళ్ల మహిళ చనిపోయింది.
{{/usCountry}}ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అనంతరం ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు సమాచారం. భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోడ్లు తీవ్రంగా రద్దీగా మారాయి, దీంతో అత్యవసర వాహనాలు వేగంగా కదలలేకపోయాయి.
అంబులెన్స్లో తరలిస్తున్న బిష్ణ.. ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయింది. అంబులెన్స్లో పరిస్థితి విషమించి మరణించింది. ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆమె ఆసుపత్రికి చేరకముందే అంబులెన్స్లోనే చనిపోయింది. మరణించిన మహిళకు 26 రోజుల పసికందుతో సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు ఈ సంఘటన దురదృష్టకరమైనది వ్యాఖ్యానించారు. మ్యాచ్ సమయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి రోడ్లపై మోహరించారని తెలిపారు. ప్రయాణాన్ని సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా ఉప్పల్లోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం సమీపంలో అంబులెన్స్ను ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్ళడానికి అనుమతించారని చెప్పారు.