హైదరాబాద్లోని ప్రముఖ పిస్తా హౌస్ అవుట్లెట్ వ్యాలెట్ పార్కింగ్ వద్ద ఒక వ్యక్తి కారును ఎత్తుకెళ్లాడు. బెయిల్పై బయటకు వచ్చిన ఒక పాత నేరస్థుడు, కర్ణాటకలోని తన తండ్రి సమాధిని దర్శించుకోవడానికి డబ్బులు లేక ఈ కారు చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టు అయిన నిందితుడిని రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్న 30 ఏళ్ల సయ్యద్ మజర్ గా గుర్తించారు. మజర్ సాధారణ వ్యక్తి కాదు, అతడు ఒక అలవాటుపడిన పాత నేరస్థుడు. గతంలో అనేక ఆస్తి సంబంధిత నేరాలు,హింసాత్మక నేరాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అతడు పలుమార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. గుడిమల్కాపూర్, లంగర్ హౌస్, సనాత్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతనిపై గతంలో కేసులు ఉన్నాయి. 2024లో అరెస్ట్ అయిన అతడు సంగారెడ్డిలోని కంది జైలుకు రిమాండ్ ఖైదీగా కూడా వెళ్లి వచ్చాడు.
మిలాద్-ఉన్-నబి పండుగ దగ్గర పడుతుండటంతో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న తన తండ్రి సమాధిని సందర్శించాలని మజర్ భావించాడు. అయితే ప్రయాణ ఖర్చులకు అతడి వద్ద తగినంత డబ్బు లేదు. దీంతో మళ్లీ దొంగతనం చేయాలని పథకం పన్నాడు.
ఆగస్టు 22న అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నంబర్ 169 వద్ద ఉన్న పిస్తా హౌస్ అవుట్లెట్కు మజర్ వెళ్లాడు. అక్కడ వ్యాలెట్ పార్కింగ్ సిబ్బంది కస్టమర్ల కార్ల కీలను కౌంటర్ వద్ద ఉంచుతున్న విషయాన్ని గమనించాడు. సిబ్బంది అందరూ కస్టమర్లకు సేవలు అందించడంలో బిజీగా ఉన్న సమయంలో, మజర్ చాకచక్యంగా కౌంటర్ నుంచి రెండు కార్ల తాళాలను దొంగిలించాడు.
ఆ తాళాలు ఏ ఏ కార్లవో తెలుసుకోవడానికి పార్కింగ్ ఏరియాలో తిరుగుతూ తాళాల బటన్లు నొక్కాడు. అవుట్లెట్ పక్కన పార్క్ చేసి ఉన్న ఒక ఐ20 కారు లైట్లు వెలగడాన్ని గమనించాడు. వెంటనే చేతిలో ఉన్న మరొక తాళాన్ని అక్కడ పడేసి, ఆ ఐ20 కారులో పరారయ్యాడు.
{{/usCountry}}ఆ తాళాలు ఏ ఏ కార్లవో తెలుసుకోవడానికి పార్కింగ్ ఏరియాలో తిరుగుతూ తాళాల బటన్లు నొక్కాడు. అవుట్లెట్ పక్కన పార్క్ చేసి ఉన్న ఒక ఐ20 కారు లైట్లు వెలగడాన్ని గమనించాడు. వెంటనే చేతిలో ఉన్న మరొక తాళాన్ని అక్కడ పడేసి, ఆ ఐ20 కారులో పరారయ్యాడు.
{{/usCountry}}కారు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన ఐ20 కారుతో పాటు ఒక లాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ కారులో ఉన్న 11 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు మాత్రం ఇంకా రికవరీ కావలసి ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి తదుపరి చర్యలు చేపట్టారు.