శంషాబాద్ ఆర్జీఐ విమానాశ్రయంలో శనివారం కూడా గందరగోళం కొనసాగింది. విమానయాన సంస్థ మొత్తం 69 విమానాలను రద్దు చేసింది. శనివారం వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్కు వచ్చే 26 విమానాలు, హైదరాబాద్ నుండి వివిధ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన 43 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు విశాఖ నుంచి 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇందులో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్కు వెళ్లేవి ఉన్నాయి.

కార్యకలాపాలను సాధారణీకరించడం, సమయపాలనను తిరిగి తీసుకురావడం కాస్త కష్టమైన పనే అని అధికారులు చెబుతున్నారు. మరో పది రోజుల్లో సాధారణ పరిస్థితులు వస్తాయంటున్నారు. దిద్దుబాటు చర్యలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి 10, 2026 నాటికి స్థిరమైన విమాన కార్యకలాపాలు పూర్తిగా పునరుద్ధరిస్తామని, రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని రద్దులు జరిగే అవకాశం ఉందని ఇండిగో తెలియజేసింది. సేవల్లో అంతరాయాలను తగ్గించడానికి డిసెంబర్ 8 నుండి విమాన కార్యకలాపాలను ఇండిగో తగ్గిస్తుంది.
37 రైళ్లకు 116 కోచ్లు
మరోవైపు విమానాశ్రయాల్లో ఉన్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. విమానాల రాకపోకల కారణంగా ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే 37 ప్రీమియం రైళ్లకు 116 అదనపు కోచ్లను అటాచ్ చేసింది. దీని ద్వారా ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచింది. పలు జోన్లలో 114 అదనపు ట్రిప్పులను కవర్ చేసింది.
రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు కోచ్లను జోడించినట్టుగా వెల్లడించింది. ఇది అన్ని జోన్లలో అత్యధికమని తెలిపింది. 'అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్లను జోడిస్తున్నాం.' రైల్వే మంత్రిత్వ శాఖ చెప్పింది.
ఉత్తర రైల్వే ఎనిమిది సర్వీసులపై ఇలాంటి చర్యలను అమలు చేసింది. రద్దీగా ఉండే ఉత్తర కారిడార్లలో రద్దీని తగ్గించడానికి అదనంగా 3AC, చైర్ కార్ కోచ్లను మోహరించింది. పశ్చిమ భారతదేశంలోని ప్రయాణికుల కోసం, పశ్చిమ రైల్వే నాలుగు ప్రధాన రైళ్లలో 3AC, 2AC కోచ్లను అటాచ్ చేయడం ద్వారా సామర్థ్యాన్ని పెంచింది. అంతేకాదు పలు ప్రత్యేక ట్రిప్పులను కూడా ప్లాన్ చేసింది రైల్వే శాఖ. విమానయాన అంతరాయాల వల్ల ప్రభావితమైన ప్రయాణీకులకు మరింత సహాయం చేయడానికి, భారతీయ రైల్వేలు నాలుగు ప్రత్యేక రైలు సేవలను కూడా ప్రారంభించాయి.
{{/usCountry}}ఉత్తర రైల్వే ఎనిమిది సర్వీసులపై ఇలాంటి చర్యలను అమలు చేసింది. రద్దీగా ఉండే ఉత్తర కారిడార్లలో రద్దీని తగ్గించడానికి అదనంగా 3AC, చైర్ కార్ కోచ్లను మోహరించింది. పశ్చిమ భారతదేశంలోని ప్రయాణికుల కోసం, పశ్చిమ రైల్వే నాలుగు ప్రధాన రైళ్లలో 3AC, 2AC కోచ్లను అటాచ్ చేయడం ద్వారా సామర్థ్యాన్ని పెంచింది. అంతేకాదు పలు ప్రత్యేక ట్రిప్పులను కూడా ప్లాన్ చేసింది రైల్వే శాఖ. విమానయాన అంతరాయాల వల్ల ప్రభావితమైన ప్రయాణీకులకు మరింత సహాయం చేయడానికి, భారతీయ రైల్వేలు నాలుగు ప్రత్యేక రైలు సేవలను కూడా ప్రారంభించాయి.
{{/usCountry}}