ఇప్పటివరకు ప్రయాణికులకు రూ.610 కోట్లు తిరిగి చెల్లించిన ఇండిగో

ఇండిగో సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. మరోవైపు ప్రయాణికులకు డబ్బులు రిఫండ్ చేస్తోంది.

Published on: Dec 7, 2025, 19:52:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కార్యకలాపాలను వేగంగా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చూస్తోంది. ఇండిగో ఇప్పటివరకు మొత్తం రూ.610 కోట్ల రీఫండ్‌లను ప్రాసెస్ చేసిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రభుత్వం విమానయాన సంస్థకు కఠినమైన ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది.

ఇండిగో
ఇండిగో

ఫ్లైట్స్ రద్దుల వల్ల ప్రభావితమైన ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేయడానికి అదనపు రుసుములు అనుమతించరని అధికారిక ప్రకటన తెలిపింది. రీఫండ్, రీబుకింగ్ సమస్యలు, ఆలస్యం లేదా అసౌకర్యం లేకుండా పరిష్కరించేందుకు, ప్రయాణికులకు ముందస్తుగా సహాయం చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇండిగో పనితీరులో మెరుగుదల కనిపించిందని, విమాన షెడ్యూల్‌లు సాధారణ స్థాయికి తిరిగి వస్తున్నాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇండిగో విమాన కార్యకలాపాలు శుక్రవారం 706 నుండి శనివారం 1,565కి పెరిగాయని, ఆదివారం నాటికి 1,650కి పెరిగాయని సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ వెల్లడించారు. ఇండిగో టీమ్ క్రమంగా సేవలను పునరుద్ధరిస్తోందని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు పని చేస్తోందని చెప్పారు. కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్నాయన్నారు. పైలట్ల కొరత, షెడ్యూల్‌ అంతరాయలతో ఇండిగో సమస్యలు ఎదుర్కొన్నది.

అన్ని ఇతర దేశీయ విమానయాన సంస్థలు సజావుగా, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవలి విమానాలు క్యాన్సిల్ కారణంగా విమాన ఛార్జీలలో తాత్కాలిక పెరుగుదల గురించి కూడా చర్చించింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణమే అమలులోకి వచ్చేలా విమాన ఛార్జీలపై పరిమితిని ప్రవేశపెట్టిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, గోవా నుండి విమానాశ్రయ డైరెక్టర్లు ఆదివారం టెర్మినల్స్ అంతటా సాధారణ పరిస్థితుల గురించి చెప్పారు. చెక్-ఇన్, సేఫ్టీ లేదా బోర్డింగ్ పాయింట్ల వద్ద రద్దీ లేకుండా ప్రయాణికుల కదలిక సజావుగా సాగిందన్నారు.

ఇండిగో సంక్షోభం వల్ల ఏర్పడిన అంతరాయాన్ని పరిష్కరించడానికి, ప్రయాణికులు నిరంతరం అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా చూసుకోవడానికి వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా విమాన ప్రయాణ కార్యకలాపాలు వేగంగా సాధారణ స్థితికి వస్తున్నాయని వెల్లడించింది.

ఇండిగో దేశవ్యాప్తంగా 3 వేలకుపైగా ప్రయాణికుల బ్యాగులను డెలివరీ చేసింది. 'ప్రయాణికుల లగేజీని తిరిగి వారికి అందజేసేందు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దీనితోపాటుగా ఇండిగో ఇప్పటివరకు రూ.610 కోట్లకుపైగా రీఫండ్స్ చేసింది. విమానాల రద్దు, ఆలస్యం తర్వాత ఈ మెుత్తాన్ని ప్రయాణికులకు చెల్లించాలి. విమానయాన సంస్థ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తుంది.' అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More