జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు మూడు రోజులే గడువు.. డిసెంబర్ 1న కరెక్షన్ విండో!

జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలి.

Published on: Nov 24, 2025 11:56 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్‌ 1 రిజిస్ట్రేషన్ గడువు నవంబర్ 27వ తేదీ రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. అదే రోజు రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 31న ప్రారంభమయ్యాయి. గడువు నవంబర్ 27 వరకు ఉంది. ఈసారి ఆన్‌లైన్ దరఖాస్తు గడువులను పొడిగించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే తెలిపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 10.60 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం ఆన్‌లైన్ దరఖాస్తులు గణనీయంగా ఉన్నాయి. ఇప్పుడు జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

మరోవైపు డిసెంబర్ 1 నుండి 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు దిద్దుబాట్లు అందుబాటులో ఉంటాయి. ఫారమ్ నింపేటప్పుడు చేసిన తప్పులను సరిదిద్దడానికి కరెక్షన్ విండో తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే విడుదల చేసింది. ఈ ఆన్‌లైన్ దిద్దుబాట్లు డిసెంబర్ 2న రాత్రి 11:50 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటాయి.

పరీక్ష కేంద్రాల వివరాలను జనవరి మెుదటివారంలో ప్రకటిస్తారు. పరీక్షకు మూడు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 12వ తేదీన వస్తాయి. మెుత్తం 13 భాషల్లో పరీక్షలు జరుగుతాయి. ఈసారి ఫిజికల్ కాలిక్యూలేటర్లకు అనుమతి లేదు. కొత్తగా ఆన్‌స్క్రీన్ వర్చువల్ కాలిక్యులేటర్ కంప్యూటర్ తెరపై ప్రత్యక్షం అవుతుంది.

అప్లికేషన్ సమయంలో గుర్తింపు నిర్ధారణ కోసం వెబ్‌కామ్ ద్వారా లైవ్ పొటో క్యాప్చర్‌తో పొటో తీస్తారు. సెక్షన్‌ ఏ, సెక్షన్‌ బీ రెండింటిలోనూ నెగెటివ్‌ మార్క్స్ ఉంటాయి. సెక్షన్ బీలో ఆప్షనల్ ప్రశ్నలు ఉండవు. ఈ సెక్షన్‌లో ఐదు ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాలి. సెక్షన్ ఏలో ప్రతీ సబ్జెక్టుకు 20 బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. సరైన సమాధానికి 4, తప్పు సమాధానికి 1 మార్కు కోత విధిస్తారు. ఎన్ఐటీలు, ఐఐటీల ప్రవేశం పొందడానికి 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కాలు సాధించాలి.

ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీలు పదో తరగతి సర్టిఫికెట్ ప్రకారం ఉండాలి. ఆధార్‌లో తాజా ఫొటో, ఇంటి అడ్రస్, తండ్రిపేరు సరిగ్గా ఉండాలి. లేదంటే అప్‌డేట్ చేయించుకోవాలి. దివ్యాంగ అభ్యర్థులకు యూడీఐడీ కార్డు చెల్లుబాటు అవుతుంది. ఈ కార్డును రెన్యువల్ చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎన్‌సీఎల్ సర్టిఫికెట్స్ చెల్లుబాటు అయ్యేవి ఉండాలి. పాతవి ఉంటే కొత్తవి తీసుకుంటే మంచిది.

News/Telangana/జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు మూడు రోజులే గడువు.. డిసెంబర్ 1న కరెక్షన్ విండో!
News/Telangana/జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు మూడు రోజులే గడువు.. డిసెంబర్ 1న కరెక్షన్ విండో!