లిక్కర్ కేసు తీర్పు : కేటీఆర్ ట్వీట్ పై కవిత సీరియస్ - ఇది కరెక్ట్ కాదంటూ సూటి ప్రశ్నలు...!

లిక్కర్ కేసు తీర్పుపై కవిత స్పందించారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. కోర్టు తీర్పు రాకుండానే తనపై కొందరు అనుచితంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేటీఆర్ ట్వీట్ పై కవిత సీరియస్ అయ్యారు.

Published on: Feb 27, 2026 4:09 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లిక్కర్ కేసులో కోర్టు తీర్పుతో ఊరట దక్కిన నేపథ్యంలో కవిత స్పందించారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని తెలంగాణ ప్రజలకు మొదట్నుంచి చెబుతూనే వచ్చానని… ఇవాళ అలాగే వచ్చానని వ్యాఖ్యానించారు.

కవిత
కవిత

ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పానని కవిత గుర్తు చేశారు. ఇవాళ కోర్టు తీర్పుతో అదే నిజమైందన్నారు. “ఈ కేసుతో నేను, నా కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించాం. విపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. కోర్టు తీర్పు రాకుండానే నాపై కొందరు అనుచితంగా మాట్లాడారు. కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తాను” అని కవిత స్పష్టం చేశారు.

కేటీఆర్ ట్వీట్ - కవిత సీరియస్

ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వైఫల్యానికి నేనా కారణం..? అని ప్రశ్నించారు.

“నాపై కేసు ఎందుకు పెట్టారు… పార్టీ కోసం కాదా..? ఇదే విషయం కేసీఆర్ చెప్పలేదా…? నేను జైలుకు వెళ్లే అంత వరకు కూడా కేటీఆర్ ఎందుకు ప్రెస్మీట్ కేసీఆర్ పెట్టలేదు. అనాడు నేను ఒంటరిగా ఫేస్ చేశా. పార్టీ సపోర్ట్ చేయలేదు. బీజేపీ సోషల్ మీడియా ఇష్టానుసారంగా ట్వీట్లు చేసింది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేను కారణమా..? నాడు ఇండ్లు ఇవ్వకపోవటం, ఉద్యోగాలు ఇవ్వకపోవటం, దోపిడీ దారులకు టికెట్లు, అహంకారం వంటి అంశాలు చర్చలో ఉన్నాయి. ఇవాళ తీర్పును మీరు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు” అంటూ కవిత కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్ ట్వీట్ లో ఏముందంటే..?

“మద్యం కుంభకోణం అనే సాకుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ (AAP) ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసు వల్ల అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం భారత రాష్ట్ర సమితి. కవిత గారికి ఈరోజు కోర్టులో న్యాయం జరిగింది. ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని మరియు కల్పితమని త్వరలోనే తేలిపోతుంది. కాంగ్రెస్ మరియు బీజేపీలు చేసిన బాధ్యతారహితమైన ఆరోపణలను మనం సత్యం గెలిచేవరకు చూసాం” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.