కరీంనగర్, వరంగల్ మధ్య ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారి(NH 563) నాలుగు లేన్ల విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. NHAI అధికారులు ఈ రహదారిపై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నారు. దసరా పండుగ కానుకగా ఈ రహదారిని జాతికి అంకితం చేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రస్తుతం కరీంనగర్ నుంచి వరంగల్ చేరుకోవడానికి సుమారు 90 నిమిషాలు(గంటన్నర) సమయం పడుతుండగా, ఈ నూతన నాలుగు లేన్ల రహదారి ప్రారంభమైన తర్వాత ప్రయాణ సమయం కేవలం 45 నిమిషాలకు తగ్గిపోనుంది. దాదాపు గంటలోపే ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన భారత్మాల పథకం కింద 68 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ 4 లేన్ల ప్రాజెక్టును రూ. 1,641 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు.
ఈ రహదారిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సదుపాయాలను ఏర్పాటు చేశారు. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్తో రహదారిపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి, ప్రమాదాలను నివారించడానికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.
రహదారి పొడవునా రాత్రివేళల్లో వెలుగులు పంచే సోలార్ దీపాలు, భద్రత కోసం హై-రిజల్యూషన్ సిసిటివి కెమెరాలను అమర్చారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ సేవలు సంఘటనా స్థలానికి త్వరితగతిన చేరుకునేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.
ఈ రహదారిలో 9 ప్రధాన వంతెనలు, 23 చిన్న వంతెనలతోపాటు పలు అండర్పాస్లను నిర్మించారు. పట్టణాల్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్ ప్రాంతాల మీదుగా బైపాస్ రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద అత్యాధునిక టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు.
ప్రారంభంలో భూసేకరణ, టెండర్ ప్రక్రియల్లో ఆలస్యం వల్ల పనులు మందకొడిగా సాగాయి. సుమారు ఏడాదిన్నర క్రితం పనులు ఊపందుకున్నప్పటికీ, స్థానిక గ్రామాల ప్రజలు తమ ఊళ్లకు కనెక్టివిటీ, అప్రోచ్ రోడ్లు కావాలని డిమాండ్ చేయడంతో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే అధికారులు వీటన్నింటినీ పరిష్కరించి పనులను పూర్తి చేశారు.
{{/usCountry}}ప్రారంభంలో భూసేకరణ, టెండర్ ప్రక్రియల్లో ఆలస్యం వల్ల పనులు మందకొడిగా సాగాయి. సుమారు ఏడాదిన్నర క్రితం పనులు ఊపందుకున్నప్పటికీ, స్థానిక గ్రామాల ప్రజలు తమ ఊళ్లకు కనెక్టివిటీ, అప్రోచ్ రోడ్లు కావాలని డిమాండ్ చేయడంతో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే అధికారులు వీటన్నింటినీ పరిష్కరించి పనులను పూర్తి చేశారు.
{{/usCountry}}గతంలో రోడ్డు అధ్వానంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు 4-లేన్ల రహదారి అందుబాటులోకి రావడంతో వాహనాల రాకపోకలు చాలా సునాయాసంగా సాగుతున్నాయి. గతంలో ఈ మార్గంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ కొత్త హైవే వల్ల ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని స్థానికులు చెబుతున్నారు.