40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయని కేసీఆర్ అన్నారు. మహబూబ్నగర్లో కృష్ణా నది 300 కిలోమీటర్లు ప్రవహిస్తోందని చెప్పారు. 174 టీఎంసీలు మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులకు రావాల్సి ఉందన్నారు. విభజన సమస్యలతో పాలమూరుకు చాలా నష్టం జరిగిందన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టులను మార్చొద్దని ఎస్ఆర్సీలో స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయం మీద బ్రిజేష్ ట్రిబ్యునల్కు అనేకసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. 1974లో బచావత్ ట్రైబ్యునల్ 17 టీఎంసీలను జూరాలకు సుమోటోగా కేటాయించిందన్నారు.

పాలమూరు, నల్లగొండ జిల్లాల్లను అద్భుతంగా తీర్చిదిద్దామని కేసీఆర్ చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పడావు పెట్టారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మండల, జిల్లాస్థాయిలో మూడు నాలుగు రోజుల్లో నేతలతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందని ఆరోపించారు. ప్రతిపక్షంగా బాధ్యతను నిర్వహిద్దామన్నారు. మరో 20 రోజుల్లో పాలమూరులో భారీ బహిరంగ సభ పెడతామన్నారు. రేపటి నుంచి కథ వేరే ఉంటదని కేసీఆర్ స్పష్టం చేశారు.
అనేక రకాల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉందని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు రాష్ట్రం మెుత్తానికే ముప్పు వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. అటు గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే.. దాని మీద చప్పుడు లేదన్నారు. ఇటు కృష్ణాలో పాలమూరు ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే.. దీనిపైనా చప్పుడు లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టుగా అని ప్రశ్నించారు.
'ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా నేనా? ఈ కాంగ్రెస్ సర్కార్ కు ప్రజా సమస్యలు పట్టవా? ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుండి ఇంకో లెక్క. రెండేండ్లు ఓపిక పట్టినం.. ఇగ ఊరుకునేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో కృష్ణా - గోదావరి జలాల్లో తెలంగాణకు మొదటికే ముప్పు వచ్చింది. అందుకే నేనే స్వయంగా రంగంలోకి దిగిన.. ఊరూరా ప్రజలను తట్టి లేపుతాం. జల దోపిడీని ఎండ గడతాం.' అని కేసీఆర్ పేర్కొన్నారు.
'వైఎస్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని అసెంబ్లీ వేదికగా ప్రశంసించాం. ఆరోగ్యశ్రీ మెుత్తాన్ని రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది? కేసీఆర్ కిట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నిలిపివేసింది. బస్తీ దవాఖానాలకు నిర్వీర్యం చేస్తున్నారు. కాంగ్రెస్ రైతులను రాచి రంపాన పెడుతోంది రైతులకు నీళ్లు ఇచ్చే చెక్ డ్యామ్లను పేల్చివేయడం దారుణం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చినవాళ్లు పాతాళంలో ఉన్నా.. పట్టుకొస్తాం.' అని కేసీఆర్ చెప్పారు.
{{/usCountry}}'వైఎస్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని అసెంబ్లీ వేదికగా ప్రశంసించాం. ఆరోగ్యశ్రీ మెుత్తాన్ని రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది? కేసీఆర్ కిట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నిలిపివేసింది. బస్తీ దవాఖానాలకు నిర్వీర్యం చేస్తున్నారు. కాంగ్రెస్ రైతులను రాచి రంపాన పెడుతోంది రైతులకు నీళ్లు ఇచ్చే చెక్ డ్యామ్లను పేల్చివేయడం దారుణం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చినవాళ్లు పాతాళంలో ఉన్నా.. పట్టుకొస్తాం.' అని కేసీఆర్ చెప్పారు.
{{/usCountry}}