Telangana Assembly Monsoon Session 2026 : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికార పక్ష శాసనసభ్యులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. ఈ భేటీలో నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించడంతో పాటు పలు కీలక అంశాలపై ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం…

నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణను సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. భూసేకరణ సకాలంలో పూర్తి కాకపోతే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎప్పటికీ ముగియదని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు నిరవధికంగా ఆలస్యమవుతాయని హెచ్చరించారు.
భూసేకరణతో పాటు నిర్వాసితుల పరిహారం, పునరావాసం, అటవీ శాఖ అనుమతులు పొందడానికి కావలసిన నిధులను ప్రభుత్వం సకాలంలో మంజూరు చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కాబట్టి ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో చొరవ తీసుకుని ప్రాజెక్టుల పనులను త్వరగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
కీలక అంశాలపై చర్చ…!
ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉంది. ప్రధానంగా 22ఏ జాబితా భూముల విషయంపై బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పాలిటెక్నిక్ విద్యార్థుల విషయంతో పాటు గోదావరి జలాల తరలింపు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు ఈసారి జరగబోయే సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే విషయం మరోసారి తెరపైకి వస్తోంది. గత సమావేశాలకు కూడా దూరంగా ఉన్న కేసీఆర్… ఈసారి వస్తారా లేరా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంటుంది.
{{/usCountry}}మరోవైపు ఈసారి జరగబోయే సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే విషయం మరోసారి తెరపైకి వస్తోంది. గత సమావేశాలకు కూడా దూరంగా ఉన్న కేసీఆర్… ఈసారి వస్తారా లేరా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంటుంది.
{{/usCountry}}